‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
సాధారణంగా హ్యాకర్లు అందినకాడికి సొమ్మును దోచుకుంటుంటారు. అయితే, డార్క్సైడ్ హ్యాకర్లుగా చెప్పుకుంటున్న ఓ ముఠా మాత్రం తాము దోచుకున్న దాంట్లో నుంచి కొంత మొత్తం దానం చేసింది.
పది వేల డాలర్ల (సుమారు 7.3 లక్షల రూపాయలు) చొప్పున బిట్ కాయిన్ల రూపంలో రెండు స్వచ్ఛంద సంస్థలకు దానం చేసినట్లు డార్క్ వెబ్లో పోస్ట్ పెట్టింది.
అయితే, విరాళాలు అందుకున్న ఆ రెండు సంస్థల్లో ఒకటైన చిల్డ్రెన్ ఇంటర్నేషనల్ తాము ఆ దానం స్వీకరించబోమని స్పష్టం చేసింది.
ఇలా హ్యాకర్ల ముఠా విరాళం ఇవ్వడాన్ని నైతికంగా, చట్టపరంగా ఓ వింత పరిణామంగా విశ్లేషకులు చూస్తున్నారు.
తమ విరాళాలకు సంబంధించిన ట్యాక్స్ రిసిప్ట్లను అక్టోబర్ 13న డార్క్ వెబ్లో ఆ హ్యాకర్ల ముఠా పోస్టు చేసింది.
భారీగా లాభాలు ఆర్జించే సంస్థలపై మాత్రమే తాము ర్యాన్సమ్ వేర్ దాడులకు పాల్పడుతుంటామని ఈ హ్యాకర్లు చెబుతున్నారు. సంస్థల ఐటీ వ్యవస్థలను తమ నియంత్రణలోకి తీసుకుని, వారి నుంచి ఈ హ్యాకర్లు డబ్బులు వసూలు చేస్తుంటారు.
''ఆ సంస్థలు చెల్లించే డబ్బులో కొంత మంచి పనులకు వెళ్లడం సబబు అని మాకు అనిపించింది. మేం చేసే పని ఎంత చెడ్డది అని మీకు అనిపించినా, ఎవరో ఒకరి జీవితంలో మార్పు తీసుకురావడంలో సాయపడుతున్నందుకు మాకు ఆనందంగా ఉంది. ఈ రోజు మేం మా తొలి విరాళాలు ఇస్తున్నాం’’ అని ఆ పోస్టులో హ్యాకర్లు రాశారు.
చిల్డ్రెన్ ఇంటర్నేషనల్తో పాటు ద వాటర్ ప్రాజెక్ట్లకు ఈ విరాళాలను ఆ హ్యాకర్ల బృందం పంపింది.
- అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి...
- ఫేస్బుక్: ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారినీ దోచుకుంటున్నారు
చిల్డ్రెన్ ఇంటర్నేషనల్ సంస్థ భారత్, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఈక్వెడార్, జాంబియా, డొమినికన్ రిపబ్లిక్, గ్వాటెమాలా, హొండురాస్, మెక్సికో, అమెరికా వంటి దేశాల్లో చిన్నారులు, కుటుంబ సంక్షేమం కోసం కృషి చేస్తోంది.
తమకు వచ్చిన విరాళం హ్యాకర్లకు చెందిందైతే, దాన్ని అంగీకరించే ఉద్దేశం తమకు లేదని చిల్డ్రెన్ ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
ఇక సహారా ఎడారికి దక్షిణంగా ఉన్న ఆఫ్రికన్ దేశాల్లో మంచి నీటి వసతులను కల్పించేందుకు పని చేస్తున్న ద వాటర్ ప్రాజెక్ట్... ఇంకా ఈ విరాళాల విషయమై స్పందించలేదు.
''ఇలా విరాళాలు ఇవ్వడం ద్వారా ఆ సైబర్ నేరస్థులు ఏం చేయాలనుకుంటున్నారన్నది పూర్తిగా తెలియదు. అపరాధ భావనను తగ్గించుకునేందుకై ఉండొచ్చు. లేకపోతే తమను తాము దోపిడీదారులుగా కాకుండా, రాబిన్ హుడ్ తరహా వ్యక్తులుగా చూపించుకునేందుకు ఇలా చేస్తుండొచ్చు. ఇలా విరాళాలు ఇవ్వడం మాత్రం అసాధారణమే. రాన్సమ్వేర్ దాడులకు పాల్పడే ముఠాలు ఇలా దానాలు చేయడం ఇదివరకు నేను ఎప్పుడూ చూడలేదు’’ అని సైబర్ భద్రత సంస్థ ఎమ్సిసాఫ్ట్కు చెందిన విశ్లేషకుడు బ్రెట్ కాలో అన్నారు.
- ఇండియాలో ఆన్లైన్ మోసాలు 600 శాతం పెరిగాయి.. ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోండి.. మీరు మోసపోకుండా జాగ్రత్తపడండి
- కరోనావైరస్ భయాన్ని సైబర్ నేరగాళ్లు ఎలా సొమ్ము చేసుకుంటున్నారు ?
డార్క్సైడ్ హ్యాకర్స్ కొత్త ముఠా. క్రిప్టో కరెన్సీ మార్కెట్ విశ్లేషణలు ఆ ముఠా దోపిడీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
గత జనవరిలో ట్రావెలెక్స్తో పాటు వివిధ సంస్థలపై జరిగిన కొన్ని ప్రముఖ ర్యాన్సమ్వేర్ దాడుల వెనుక ఉన్న సైబర్ నేర ముఠాలతో డార్క్ సైడ్ హ్యాకర్స్కు కూడా సంబంధాలు ఉండొచ్చని సూచించే ఆధారాలు కనిపిస్తున్నాయి.
ఇక డార్క్ సైడ్ హ్యాకర్స్ ముఠా విరాళాలు ఇచ్చేందుకు వాడిని చెల్లింపు విధానం కూడా భద్రతా సంస్థలకు ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాకు చెందిన 'ద గివింగ్ బ్లాక్’ అనే సర్వీసును సైబర్ నిపుణులు ఇందుకోసం వాడుకున్నారు. 67 స్వచ్ఛంద సంస్థలకు క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు అందించేందుకు ద గివింగ్ బ్లాక్ ఉపయోగపడుతోంది.
ద గివింగ్ బ్లాక్ను 2018లో నెలకొల్పారు. ఎవరైనా క్రిప్టో కరెన్సీతో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చి, దీని ద్వారా పన్ను రాయితీలు పొందొచ్చు.
అయితే, సైబర్ నేరస్థులు తమ వేదిక ద్వారా ఆ విరాళాలు ఇచ్చినట్లు తమకు తెలియదని ద గివింగ్ బ్లాక్ బీబీసీతో చెప్పింది.
''అది దోచుకున్న సొమ్మేనా అన్నది నిర్ధారించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ దోచుకున్న సొమ్మే అయితే, వాస్తవంగా అది ఎవరికి చెందిందో వారికి అందించేలా కృషి చేస్తాం’’ అని పేర్కొంది.
''క్రిప్టో కరెన్సీ వినియోగించినందు వల్ల వారిని పట్టుకోవడం ఇంకా సులభం అవుతుంది. కష్టం కాదు’’ అని ద గివింగ్ బ్లాక్ వ్యాఖ్యానించింది.
అయితే, దాతల నుంచి ఎలాంటి గుర్తింపు సమాచారం సేకరిస్తారన్న విషయం ద గివింగ్ బ్లాక్ వెల్లడించలేదు.
బిట్ కాయిన్ చెల్లింపుల సేవలు అందించే చాలా సంస్థలు వినియోగదారుల గుర్తింపు వివరాలు సేకరిస్తాయి. అయితే, ద గివింగ్ బ్లాక్ ఇలా సేకరిస్తుందో, లేదో తెలియరాలేదు.
- దిల్లీలో 'స్కామ్' కాల్సెంటర్ గుట్టు రట్టు చేసిన బీబీసీ... ఇద్దరు హైటెక్ మోసగాళ్ళ అనుభవాలు
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్ను తలపించే స్టోరీ
ద గివింగ్ బ్లాక్ ద్వారా బీబీసీ అజ్ఞాతంగా విరాళం ఇచ్చేందుకు ప్రయత్నించి చూసింది. ఆ సమయంలో ద గివింగ్ బ్లాక్ ఎలాంటి గుర్తింపు వివరాలూ అడగలేదు. గుప్త విరాళాల కారణంగా వచ్చే సమస్యలను ఈ ఉదంతం బయటపెడుతోందని నిపుణులు అంటున్నారు.
''గుప్త విరాళాలు ఇస్తూ, పన్ను రాయితీల రసీదులు పొందుతున్నారంటే, వారిని ప్రశ్నించాల్సిందే. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను గుర్తించడంలో పరిశోధకులు, భద్రతా సంస్థలు చాలా పురోగతి సాధించారు. అయితే, లావాదేవీలు ఏ ఖాతా నుంచి ఏ ఖాతా మధ్య జరుగుతున్నాయన్నది మాత్రమే బయటపడుతోంది. అవి ఎవరి సొంతమన్న విషయం మాత్రం చాలా సంక్లిష్టమైంది. ఇలా గుప్త విరాళాలు అందించడాన్ని అనుమతిస్తే, మనీ లాండరింగ్కు అవకాశాలు పెరగొచ్చు. క్రిప్టో కరెన్సీ లావాదేవీల సేవలందించే సంస్థలన్నింటినీ కేవైసీ పరిధిలోకి తేవాలి’’ అని చైన్ అనాలసిస్ సంస్థకు చెందిన క్రిప్టో కరెన్సీ పరిశోధకుడు ఫిలిప్ గ్రాడ్వెల్ అన్నారు.
ద గివింగ్ బ్లాక్ ద్వారా విరాళాలను తీసుకుంటున్న మిగతా స్వచ్ఛంద సంస్థలతోనూ బీబీసీ మాట్లాడింది.
తమకు తెలిసి నేరస్థుల నుంచి ఎప్పుడూ విరాళాలు తీసుకోలేదని సేవ్ ద చిల్డ్రెన్ సంస్థ తెలిపింది.
''క్రిప్టో కరెన్సీ విరాళాల ద్వారా నేరస్థులు స్వప్రయోజనాలు పొందడం సిగ్గు చేటు. గుప్త దాతలు కూడా మేం నమ్మే విలువలు పాటించేవారై ఉండాలని మేం కోరుకుంటున్నాం’’ అని 'షీ ఈజ్ ద ఫస్ట్’ స్వచ్ఛంద సంస్థ వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
- సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- 'సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- ఇండియాలో కరోనావైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- 'కలకత్తా’లో వేశ్యలకు బలవంతంగా జననేంద్రియ పరీక్షలు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక 'దేశం’ ఇదేనా?
- బతికుండగానే ఫ్రీజర్లో పెట్టారు.. అయినా బతికాడు.. కానీ..
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- 'నాన్లోకల్ లీడర్ల’ అడ్డాగా విశాఖ... నగరంలో 30 ఏళ్లుగా వారి హవా సాగుతుండటానికి కారణాలేంటి?
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- 'బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- 'మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)