భారత్, పాక్, మధ్య.. అణుయుద్ధం జరుగుతుందా? పశ్చిమ దేశాల్లో టెన్షన్!?
ఇండియా, పాకిస్తాన్, చైనా నడు అణుయుద్ధం వచ్చే అవకాశాలున్నాయా? ఈ మూడు దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై పశ్చిమ దేశాల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది.
వాషింగ్టన్: ఇండియా, పాకిస్తాన్, చైనా నడు అణుయుద్ధం వచ్చే అవకాశాలున్నాయా? ఈ మూడు దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై పశ్చిమ దేశాల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది.
త్వరలోనే దక్షిణ ఆసియా దేశాల్లో ఆకాశం ఊడిపడే ప్రమాదం ఉందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. కానీ వాషింగ్టన్కు చెందిన అట్లాంటిక్ కౌన్సిల్ సంస్థ మాత్రం దీనికి సంబంధించి ఓ క్లారిటీ ఇచ్చింది.

ఇండియా, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరిగే ఛాన్సే లేదని ఆ సంస్థ తేల్చేసింది. అట్లాంటిక్ కౌన్సిల్లోని దక్షిణాసియా నిపుణులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీ, ఇస్లామబాద్, బీజింగ్లో జరిగిన సెమినార్ల ఆధారంగా కౌన్సిల్ ఈ నిర్ణయానికి వచ్చింది.
భారత్, పాక్, చైనా మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నా.. ఆ దేశాల మధ్య వాణిజ్యం బాగానే ఉందని అట్లాంటిక్ కౌన్సిల్ తెలిపింది. భారత ఉప ఖండంలో అణు యుద్ధం రావచ్చు అని వస్తున్న వాదనలకు ఆధారాలు లేవని ఆ సంస్థ వెల్లడించింది.
అయితే చైనా, భారత్లో జాతీయవాదం దూకుడుగా ఉందని, చైనా, పాకిస్తాన్, ఇండియా.. ఈ మూడు దేశాల్లోనూ అణ్వాయుధ నిర్ణయం మిలిటరీ చేతుల్లో లేదని, ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి, అణుయుద్ధం వస్తుందేమో అనే భయం అవసరం లేదని పేర్కొంది.
భారత్, పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పటికీ.. ఆ దేశాలేమీ అణు పరీక్షలు నిర్వహించడం లేదని అట్లాంటిక్ కౌన్సిల్ అభిప్రాయపడింది. చైనా కూడా తన వార్హెడ్స్ను ఉపయోగించడం లేదని పేర్కొంది.
-
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
చైనాకు బిగ్ షాక్.. భారత్కు రష్యా క్రూడాయిల్ షిప్పులు యూ టర్న్!! -
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
శృంగారంలో తేలియాడండి: హాలీడే ప్రకటించిన కాలేజ్ -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ఇగో తగ్గని ప్లేయర్లు.. దిక్కులేని బోర్డు.. పాక్ క్రికెట్ను ముంచేది వీళ్లేనా? -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications