బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడు: కాపాడేందుకు రంగంలోకి సహాయక బృందాలు
మెదక్: జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో శనివారం ఉదయం మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు తాగునీటి బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, 108 సిబ్బంది బాలుడ్ని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన కుమ్మరి రాములు అనే రైతు శనివారం తెల్లవారుజామున బోరు వేయగా అందులో నీరు రాలేదు. బోరు బావిపై మూత వేయకుండా అలాగే వదిలేసి వెళ్లిపోయాడు. సాయిలు ఇంటికి వంద మీటర్ల దూరంలో ఈ బోరు బావి ఉంది.
శనివారం ఉదయం సాయిలు కుమారుడు రాకేశ్(3) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయాడు. తమ కొడుకు బోరుబావిలో పడటం కళ్లారా చూశామని తల్లిదండ్రులు మొగులమ్మ, సాయిలు చెబుతున్నారు.

సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం కూడా బాలుడ్ని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
బాలుడ్ని కాపాడేందుకు సహాయక సిబ్బంది ప్రొక్లెనయిన్ సహాయంతో బావి చుట్టూ భూమిని తవ్వుతున్నారు. దాదాపు 140అడుగుల లోతులో ఉన్న ఈ బోరుబావిలో పడిన బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు 108 సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అయితే అతడు ఎంత లోతులో ఉన్నది తెలియడంలో లేదు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications