Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్రతో బెదిరిస్తూ, బురద నీటిలో మునగాలని: దళిత యువకులపై బీజేపీ నేత దాష్టీకం (వీడియో)

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నంలో ఇద్దరు దళిత యువకులను అవమానించి, వారిపై దాడి చేసినందుకు గాను బీజేపీ నాయకుడు భరత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది.

Recommended Video

    BJP leader beats 2 Dalits with stick : బురద నీటిలో మునగాలని

    నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నంలో ఇద్దరు దళిత యువకులను అవమానించి, వారిపై దాడి చేసినందుకు గాను బీజేపీ నాయకుడు భరత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది.

    దళిత యువకులు కొండ్ర లక్ష్మణ్, రాజేశ్వర్‌లపై భరత్ రెడ్డి దాడి చేశాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదయింది.

    BJP leader beats 2 Dalits with stick, forces them to dip in muddy pond

    ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గంగాధర్ ఫిర్యాదు చేశారని, ఈ మేరకు భరత్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    కాగా, అక్రమంగా మట్టిని తరలించడాన్ని ఆ దళిత యువకులు ప్రశ్నించారని, దీంతో వారిపై భరత్ రెడ్డి ఆటవికంగా దాడి చేశాడని తెలుస్తోంది. కర్రతో బెదిరిస్తూ, వారిద్దరిని బురద ఉన్న చెరువులో మునగాలని హెచ్చరించాడు.

    దళిత యువకులపై భరత్ రెడ్డి దాడి నేపథ్యంలో దళిత బహుజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు సిద్దమయ్యాయి. ఈ నెల 19న నిజామాబాద్ జిల్లా అభంగపట్నంలో నిరసనకు పిలుపునిచ్చాయి. భరత్ రెడ్డి దాష్టికానికి తగిన బుద్ది చెప్పాలని దళిత బహుజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+