భర్త ఆలస్యమవుతుందనడంతో.. ఆమె బయలుదేరింది: మధ్యలోనే ఊహించని విధంగా..
నవీన్శర్మ, ప్రత్యూష(25)దంపతులు చైతన్యపురి ఫణిగిరి కాలనీలో నివసిస్తున్నారు. నవీన్శర్మ రామాలయంలో పూజారిగా పనిచేస్తుండగా, ప్రత్యూష ఇంటి వద్దే ఉంటోంది. శనివారం సాయంత్రం ప్రత్యూష కూడా రామాలయం వెళ్లింది.
హైదరాబాద్: రాజధానిలో మరో చైన్ స్నాచింగ్ ఉదంతం వెలుగుచూసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వివాహితపై స్ప్రే కొట్టి.. ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కెళ్లాడు.
పోలీసుల కథనం ప్రకారం.. నవీన్శర్మ, ప్రత్యూష(25)దంపతులు చైతన్యపురి ఫణిగిరి కాలనీలో నివసిస్తున్నారు. నవీన్శర్మ రామాలయంలో పూజారిగా పనిచేస్తుండగా, ప్రత్యూష ఇంటి వద్దే ఉంటోంది. శనివారం సాయంత్రం ప్రత్యూష కూడా రామాలయం వెళ్లింది.

అయితే తనకు ఆలస్యం అవుతుందని భర్త చెప్పడంతో.. ఆమె ఒంటరిగా నడుచుకుంటూ ఇంటి వైపు బయలుదేరింది. ఇంతలో దేవాలయానికి కొద్ది దూరంలోనే ఎదురుగా వచ్చిన ఓ దుండగుడు ఆమె ముఖంపై స్ప్రే కొట్టాడు. తేరుకునేలోపే ఆమె మెడలోని బంగారు గొలుసుతో ఉడాయించాడు. శనివారం రాత్రి 9గం. సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సరూర్నగర్లో ఇదే తరహాలో ముఖంపై స్ర్పే కొట్టి స్నాచింగ్ జరిగిన ఘటన మరవకముందే చైతన్యపురిలో మరో సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?












Click it and Unblock the Notifications