ఏపీ అభ్యంతరాలు పట్టించుకోవద్దు, మీ పని కానివ్వండి: కన్నడ మంత్రికి హరీశ్ ఫోన్
హైదరాబాద్/బెంగళూరు: తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చడానికి చేపట్టిన రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) పనులను ఆపొద్దని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి పాటిల్కి విజ్ఞప్తి చేశారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్మోహన్ రాసిన లేఖ కారణంగా ఆనకట్ట ఆధునికీకరణ, పూడికతీత పనులను ఆపొద్దని హరీశ్రావు విన్నవించారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు అందించేపనులపై ముందుకు వెళ్లాలని హరీశ్ కోరారు.

ఆర్డీఎస్ పనులు మొదలు పెడితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని కర్నూలు కలెక్టర్ కర్నాటకకు ఇటీవలే లేఖ రాసిన విషయం తెలిసిందే.
వారం రోజుల క్రితం ఆనకట్ట ఆధునీకరణ పనులకు కర్నాటక సన్నాహాలు చేపట్టగా కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు ఆ పనులను అడ్డుకున్నారు. తమ ప్రాంతం దిగువకు ఉండటంతో ఈ పనులవల్ల నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని ఏపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా, తమకు రావాల్సిన న్యాయమైన వాటానే వాడుకుంటున్నామని తెలంగాణ వాదిస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications