Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్: పట్టపగలు.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా.. విద్యార్థిని నరికి చంపేశారు!

హైదరాబాద్: కొంతమంది దుండగులు బస్సులో ప్రయాణిస్తోన్న ఓ విద్యార్థిని చొక్కా పట్టుకుని కిందికి లాగి, పట్టపగలే నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో నరికి చంపారు. సోమవారం కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుటే జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

మృతుడు మూసాపేటకు చెందిన ఎర్రగళ్ల సుధీర్(17)గా చెబుతున్నారు. ఇతడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు బస్సులో వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Intermediate student stabbed to death in full public view

నలుగురు దుండగులు సుధీర్‌ను బస్సులోంచి బలవంతంగా కిందికి లాగారు. బస్సు నుంచి దిగిన సుధీర్ వారినుంచి తప్పించుకుని రోడ్డుపై పరిగెత్తాడు. అయినా వారు వదలకుండా అతడ్ని వెంటాడి కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు.

ఈ ఘటనలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన సుధీర్ అక్కడికక్కడే ప్రాణం విడిచినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఆ నలుగురు దుండగుల్లో ఒకడిని స్థానికులు పట్టుకోగా మరో ముగ్గురు పరారయ్యారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడ్ని అదుపులోకి తీసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

స్నేహితులతో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుధీర్ స్నేహితులైన నవీన్, కృష్ణ, మహీ, తేజ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధీర్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+