షాకింగ్: పట్టపగలు.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా.. విద్యార్థిని నరికి చంపేశారు!
హైదరాబాద్: కొంతమంది దుండగులు బస్సులో ప్రయాణిస్తోన్న ఓ విద్యార్థిని చొక్కా పట్టుకుని కిందికి లాగి, పట్టపగలే నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో నరికి చంపారు. సోమవారం కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎదుటే జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
మృతుడు మూసాపేటకు చెందిన ఎర్రగళ్ల సుధీర్(17)గా చెబుతున్నారు. ఇతడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు బస్సులో వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నలుగురు దుండగులు సుధీర్ను బస్సులోంచి బలవంతంగా కిందికి లాగారు. బస్సు నుంచి దిగిన సుధీర్ వారినుంచి తప్పించుకుని రోడ్డుపై పరిగెత్తాడు. అయినా వారు వదలకుండా అతడ్ని వెంటాడి కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎదుట నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు.
ఈ ఘటనలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన సుధీర్ అక్కడికక్కడే ప్రాణం విడిచినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఆ నలుగురు దుండగుల్లో ఒకడిని స్థానికులు పట్టుకోగా మరో ముగ్గురు పరారయ్యారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడ్ని అదుపులోకి తీసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
స్నేహితులతో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుధీర్ స్నేహితులైన నవీన్, కృష్ణ, మహీ, తేజ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధీర్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications