రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మియాపూర్ భూకుంభకోణాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది.
ఈ ఆందోళనలో రేవంత్రెడ్డి, ఎల్ రమణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన మూడేళ్లలోనే రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు.

భూకుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సీఎం, ఆయన కుటుంబీకులు, అనుచరులపైనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
ఆందోళనలో పాల్గొన్న రేవంత్ రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఇదేమీ రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటూ రేవంత్ నినాదాలు చేశారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications