రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మియాపూర్ భూకుంభకోణాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది.
ఈ ఆందోళనలో రేవంత్రెడ్డి, ఎల్ రమణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన మూడేళ్లలోనే రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు.
భూకుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సీఎం, ఆయన కుటుంబీకులు, అనుచరులపైనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
ఆందోళనలో పాల్గొన్న రేవంత్ రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఇదేమీ రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటూ రేవంత్ నినాదాలు చేశారు.