స్పీకర్ మాటల్లో భయం; నిజాం రాజులా కేసీఆర్ దౌర్జన్యపాలన: రాజా సింగ్
తెలంగాణ శాసనసభ సమావేశాలలో తమను అనుమతించాలని కోర్టు సూచనలతో స్పీకర్ కు మరోసారి విజ్ఞప్తి చేసిన బిజెపి ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో బిజెపి ఎమ్మెల్యేలు స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాటల్లో భయం కనిపించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
స్పీకర్ తో భేటీ తర్వాత ఎమ్మెల్యే రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీకర్ ను ఎంత టార్చర్ పెడుతున్నాడో ఆయనను చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. స్పీకర్ చాలా భయంతో తమ అభ్యర్ధన తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ పోడియం దగ్గరకు రాని ఈటల రాజేందర్ ను, రఘునందన్ రావును సస్పెండ్ చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. కేవలం బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కడం కోసమే సస్పెన్షన్ జరిగిందని రాజా సింగ్ వెల్లడించారు.

సీఎం కేసీఆర్ తన ప్లాన్ ను స్పీకర్ ద్వారా అమలు చేశారని రాజా సింగ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు స్పీకర్ నడుచుకోవాల్సి వస్తుందని అన్నారు. అసెంబ్లీలో 10మంది ఎమ్మెల్యేలు గొడవ చేసినా అక్కడ స్పీకర్ వారిని సస్పెండ్ చేయలేదని రాజా సింగ్ పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అందుకు భిన్నంగా అసెంబ్లీ పర్వం కొనసాగుతోంది అంటూ వ్యాఖ్యానించారు. నిజాం రాజులు ఎంత దౌర్జన్యంగా పరిపాలన సాగించారో కెసిఆర్ ప్రస్తుతం అదే చేస్తున్నారంటూ రాజా సింగ్ వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్ సభలోకి వస్తే కెసిఆర్ చేసిన పాపాలు బయటపెడతాడని భయంతోనే సభలోకి రానివ్వడంలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ప్రజల రక్తం తాగుతున్న కేసీఆర్ ను త్వరలోనే గద్దె దించుతామని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. తెలంగాణా సీఎం కేసీఆర్ తీరుకు, తమను శాసన సభ సమావేశాల నుండి సస్పెండ్ చేసిన స్పీకర్ తీరుకు నిరసనగా 17వ తేదీ ఇందిరా పార్క్ లో నిరసన దీక్ష చేస్తామని వెల్లడించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications