ఆ బాధ్యత ప్రభుత్వానిదే: వరంగల్ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
వరంగల్/విశాఖపట్నం: వరంగల్ జిల్లాలోని కోటిలింగాల దగ్గర ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం స్పందించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, కోటిలింగాల అగ్నిప్రమాదం దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు.
Recommended Video
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వరంగల్ జిల్లా కోటిలింగాల దగ్గర చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు మృత్యువాత పడటం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు. బాణసంచా గోదాములో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.
వరంగల్ ఘోర ప్రమాదం: పోలీసుల అదుపులో భద్రకాలి పైర్ వర్క్స్ ఓనర్
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. pic.twitter.com/cCUJlSS7Kc
— JanaSena Party (@JanaSenaParty) July 4, 2018
ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు తావులేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.