హైదరాబాద్ పూర్ణిమ ముంబైలో ప్రత్యక్షం: సినిమాల కోసమేనా? ఏం జరిగింది?
సుమారు నెలన్నర రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ ఎట్టకేలకు లభించింది. తాను అనాథనని మారుపేరుతో
హైదరాబాద్: సుమారు నెలన్నర రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ ఎట్టకేలకు లభించింది. తాను అనాథనని చెప్పుకొన్న ఆమె ముంబైలోని దాదర్ సమీపంలోని ఓ ఆశ్రమంలో మారుపేరుతో ఉంటున్నట్లు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు సమాచారం అందింది. సినిమాలపై ఆసక్తితోనే ఆమె ముంబై చేరినట్లు తెలిసింది.
25 రోజుల క్రితం ముంబై చేరుకున్న పూర్ణిమ.. సినిమాల్లో అవకాశాల కోసం ముంబైలోని ఫిల్మ్ స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. తాను ఊహించిన దాని కన్నా భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్న తరువాతనే పోలీసులను ఆశ్రయించానని.. అయితే, ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతోనే పోలీసులకు అబద్ధాలు చెప్పానని వెల్లడించింది. సినిమా స్టూడియోల ముందు తనను ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది. ఇక మనసులోని కోరికను తీర్చుకునే దిశగా అడుగులు వేసిన పూర్ణిమ తన జీవితాన్ని రిస్క్ లో పెట్టుకోవడం గమనార్హం.

నెలన్నర క్రితం అదృశ్యం
హైదరాబాద్ నగరంలోని నిజాంపేటలోని అమృతసాయి రెసిడెన్సీలో నివసించే నాగరాజు, విజయకుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పూర్ణిమ సాయి(15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. జూన్ 7న పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు.

కిడ్నాప్ కేసుగా దర్యాప్తు ముమ్మరం
తొలుత అదృశ్యం కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు 15 బృందాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు షిర్డీ, పుణె తదితర నగరాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో జులై 13న కిడ్నాప్ కేసుగా మార్చారు. అనంతరం మరింత ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

సినిమాలపై ఆసక్తితోనే..
సినిమాల్లో నటించాలన్న ఆసక్తితోనే పూర్ణిమ సాయి ముంబై వెళ్లి దాదర్లోని ఓ సినీ స్డూడియో వద్ద సంచరిస్తుండగా స్థానికులు పోలీసుల సాయంతో డొంగరి బాల్సుధార్ ఆశ్రమంలో చేర్పించారు. వారికి తాను అనాథనని.. తన పేరు అనికాశ్రీగా చెప్పుకొంది. అంతేగాక, హైదరాబాద్ తుకారాంగేట్లోని సాయిశ్రీ అనాథాశ్రమం నుంచి వచ్చినట్లు పేర్కొంది. కాగా, అంతకుముందు పూర్ణిమ 15రోజులపాటు షిర్డీలో ఉన్నట్లు తెలిసింది.

ఆచూకీ దొరికిందిలా..
ఈ మేరకు దాదర్లోని బోయవాడ పోలీసులు బాలిక చిత్రాలను ముంబైలో గోడలకు అంటించారు. కాగా, ఈ సమాచారం ఆదివారం తుకారాంగేట్ సీఐ రమేష్కు అందింది. దాదాపు 40 రోజులకుపైగా కుమార్తె ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పుట్టిన రోజే క్షేమ సమాచారం..
అయితే, ఆదివారం పూర్ణిమ పుట్టిన రోజు కావడం, ఆ సాయంత్రానికి ఆమె క్షేమ సమాచారం అందడంతో వారు ఆనందపరశులయ్యారు. కాగా, సోమవారం పోలీసులు, తల్లిదండ్రులు ముంబైకి వెళ్లనున్నట్లు సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపారు. దీంతో ఇంతకుముందు పుర్ణిమను ఆమె చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులే కిడ్నాప్ చేశారనే ఆరోపణలు వచ్చినప్పటికీ అదంతా అవాస్తవమని తేలిపోయింది.
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications