ఘోర ప్రమాదం: ఆటో-లారీ ఢీ, ఐదుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఫ్లైవర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
బండమీదిపల్లికి వెళ్తున్న ప్రయాణికుల ఆటోను లారీ వేగంగా ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకవోడం లేదంటూ స్థానికులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.
బాధితులు బండమీదిపల్లి పరిసర గ్రామాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications