చిన్నోడిని అమెరికా వెళ్లనీయను: కుప్పకూలిన శ్రీనివాస్ తల్లి, బోరున ఏడ్చిన భార్య
అమెరికాలో జాత్యాహంకార కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. మల్లంపేటలోని ఆయన నివాస స్థలం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది.
హైదరాబాద్: అమెరికాలో జాత్యాహంకార కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. మల్లంపేటలోని ఆయన నివాస స్థలం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది.
అంతిమయాత్రలో శ్రీనివాస్ బంధువులు, స్నేహితులు, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికాలో జాత్యాహంకారం నశించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. శ్రీనివాస్ భార్యను, తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

కుప్పకూలిన తల్లిదండ్రులు
అమెరికాలో జరిగిన జాత్యంహకార దాడిలో మృతిచెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య ముగిశాయి. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లితండ్రులు కుప్పకూలి పోయారు. కన్నీరుమున్నీరు అయ్యారు.

నా చిన్న కొడుకును అమెరికా వెళ్లనివ్వను
కూచిభొట్ల శ్రీనివాస్ తల్లి వర్థిని బోరున విలపించారు. ఆమెను ఆపడం ఎవ్వరి తరం కాలేదు. తన చిన్న కుమారుడిని ఇఖ అమెరికా వెళ్లనివ్వను, సాయి కిరణ్ కుటుంబాన్ని హైదరాబాద్ వచ్చేయమని చెప్తానని అన్నారు.

పిల్లలు స్థిరపడ్డారనే సంతోషం..
ఇద్దరు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారని ఆనందంగా ఉన్న సమయంలో ఇంత ఘోరం జరిగిందని తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.

తిరిగి వచ్చేయమంటే ఇబ్బంది లేదన్న శ్రీనివాస్
ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే తిరిగి వచ్చేయాలని శ్రీనివాస్కి చెప్పే దానిని అని ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యారు. ఇబ్బందులు ఏమీ లేవని శ్రీనివాస్ తనకు చెబుతుండేవాడన్నారు.

కంటతడి పెట్టించింది
ఇప్పటికైనా అమెరికాలో ఉండే భారతీయులకు రక్షణ కల్పించాలని తాను కోరుతున్నానని కూచిభొట్ల శ్రీనివాస్ తల్లి విలపించారు. ఆమె విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.

అంత్యక్రియలకు ప్రముఖులు హాజరు
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీ నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు తదితరులు శ్రీనివాస్కు నివాళులర్పించారు. శ్రీనివాస్ మృతదేహం సోమవారం రాత్రి సమయంలో ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే.

బరువెక్కిన గుండెతో..
శ్రీనివాస్ మృతదేహం చూసిన గుండె బరువెక్కింది. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు విషాదవదనంతో విలపించారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు వర్థిని, మధుసూదనరావు కుప్పకూలిపోయారు.

విలపించిన భార్య
శ్రీనివాస్ మృతదేహాంతో పాటు వచ్చిన ఆయన భార్య సునయన బోరున ఏడ్చారు.
మంగళవారం శ్రీనివాస్ను కడసారి చూసేందుకు పెద్దయెత్తున ఆయన నివాసానికి పోటెత్తారు.

ట్రంప్తో మోడీ మాట్లాడాలి: నారాయణ
అమెరికాలో తెలుగు వారి పైన జరుగుతున్న జాతి వివక్ష పైన ప్రధాని మోడీ స్పందించి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడాల్సిన అవసరం ఉందని సిపిఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు.

అందరూ వెనక్కి వస్తే వ్యవస్థ కుప్పకూలుతుంది
అమెరికాలో ఉన్న భారతీయులంతా ఒక్కసారిగా వెనక్కి వస్తే అక్కడి వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. అక్కడ ఉన్న తెలుగు సంఘాలు అన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. అంతకుముందు, శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహానికి నారాయణ నివాళులు అర్పించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications