జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీనివాసన్కు ఊరట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ మాజీ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్కు హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ హైకోర్టు న్యాయమూర్తి బి.శివశంకరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు.
ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా ఏ విధమైన ప్రయోజనం కూడా పొందలేదని, కుట్రలో శ్రీనివాసన్ పాత్ర లేదని స్పష్టం చేశారు. కంపెనీ చర్యలకు శ్రీనివాసన్ను బాధ్యుడు కాదని స్పష్టం చేశారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్కు కడప జిల్లా చౌడూరులో 2.60 ఎకరాల భూమి లీజు పొడిగింపు, రంగారెడ్డి జిల్లా కాగ్నా నుంచి అదనంగా 13 మిలియన్ క్యూబిక్ అడుగులు, కృష్ణా నుంచి అదనంగా 7 లక్షల గ్యాలన్ల నీటిని అప్పటి వై.ఎస్.నేతృత్వంలోని ప్రభుత్వం కేటాయించిందని సీబీఐ ఆరోపించింది.

అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో రూ.140.32 కోట్లు పెట్టుబడి పెట్టారంటూ శ్రీనివాసన్పై అభియోగ పత్రంలో ఆరోపణ చేశారు. ఇందులో మూడో నిందితుడిగా ఉన్న శ్రీనివాసన్ తన పేరును కేసు నుంచి తప్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీ చర్యలకు ఎండీని బాధ్యులను చేయడం సరికాదని, బోర్డు తీర్మానం మేరకే అవి జరిగాయని శ్రీనివాసన్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. భారతి మిట్టల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శ్రీనివాసన్పై ఉన్న కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులో నిందితుల జాబితాలో ఇండియా సిమెంట్స్ కొనసాగుతుంది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications