హుస్సేన్ సాగర్ ప్రక్షాళన: ట్యాంక్బండ్పై ట్రాఫిక్ బంద్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ట్యాంక్బండ్ను తాత్కాలికంగా మూసివేశారు. హుస్సేన్సాగర్ ప్రక్షాళణలో భాగంగా 10 రోజుల పాటు ఈ మార్గాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బుద్ధభవన్ చౌరస్తాలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రోడ్డును బ్లాక్ చేశారు. వైశ్రాయ్ హోటల్ వద్ద పెద్ద గుంతకు మరమ్మత్తులు చేసి అక్కడి నుంచి నెక్లెస్రోడ్డు వైపు పనులు ప్రారంభించారు. కూకట్పల్లి నాలా నుంచి వచ్చే పైపును తిరిగి తీసివేసి నూతన పైపును వేసేందుకు మూడు కిలోమీటర్ల మేర భారీ సొరంగాన్ని తవ్వనున్నారు.

దీని ద్వారా భారీ పైప్లైన్ వేసేందుకు జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. 24 గంటల పాటు మూడు షిఫ్ట్లలో సిబ్బంది 10 రోజుల పాటు ఈ పనులను చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి రాణిగంజ్ వైపు అక్కడి నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడీగూడ వైపు మళ్లించారు.
లక్షకుపైగా వాహనాలు ట్యాంక్బండ్ రోడ్డుపై నిత్యం ప్రయాణిస్తుంటాయి. ట్యాంక్ బండ్ మూసివేతపై ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications