వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'ఎపి అవతరణ దినోత్సవాలు అనైతికం'
తెలంగాణ (హైదరాబాద్)తో పొట్టి శ్రీరాములుకు ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదని, అయినా అవతరణ దినోత్సవాలకు పొట్టి శ్రీరాములు పేరును వాడుకుంటున్నారని, పొట్టి శ్రీరాములు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మాత్రమే ఆమరణ నిరాహార దీక్ష చేశారని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలితంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. ఆ తర్వాతనే తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారున.
వాస్తవాలు తెలిసి కూడా నవంబర్ 1వ తేదీకి పొట్టి శ్రీరాములు ఫొటోలు, పేరును వాడుకోవడ సరైంది కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. చరిత్ర చరిత్రనే అని, అది మారదని వారిద్దరు గమనించడం అవసరమని ఆయన అన్నారు.
Comments
English summary
Telangana Development Forum UK & Europe condemns the celebrations on Nov-1st for the reason of Andhra Pradesh formation day.
Story first published: Thursday, November 3, 2011, 8:43 [IST]