ద్వితీయ శ్రేణి తారలపైనే ఎన్నారైలకు మోజు, ఎందుకు?

చిరంజీవి, నాగార్జున వంటి నటులు గానీ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి మాస్ హీరోలు గానీ ఎన్నారైల కంటికి ఆనడం లేదు. ఈ ఏడాది ఎన్నారై సంఘాలు వారిని ఆహ్వానించలేదు. అమెరికాలోని రెండు తెలుగు సంఘాల వేడుకలకు వెళ్లిన 200 మందికి పైగా తారల్లో పేరున్న హీరోయిన్ శ్రియా శరన్ ఒక్కతే. మిగతా వారంతా బి - గ్రేడ్, సి - గ్రేడ్ తారలే. హైదరాబాదులో వ్యభిచారం కేసులో పట్టుబడిన వర్ధమాన నటి జ్యోతి కూడా ఉంది. ఇందుకు కారణమేమిటో, ఇందులోని ఆంతర్యమేమిటో ఎవరికైనా ఇట్లే అర్థమై పోతుంది. ఈ ఏడాది ఆటా వేడుకలకు సినీ ప్రముఖుల్లో బాలకృష్ణ మాత్రమే వెళ్లాడు. ఆయన తన క్యాన్సర్ ఆస్పత్రికి 60 లక్షల రూపాయలు విరాళంగా తెచ్చుకున్నారు. నాట్స్ వేడుకలకు రామ్ చరణ్ తేజ్ హాజరయ్యాడు.
అమెరికాలోని తానా రెండుగా చీలిపోయింది. దాని నుంచి చీలినవారు నాట్స్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి రెండు ఇటీవల పోటాపోటీగా వేడుకలు నిర్వహించుకున్నాయి. వాటిని నడిపేవారు మారారు. ఐటి వృత్తినిపుణులు, ఇంజనీర్లు, ఇతరులు ఆ సంస్థలను నడుపుతున్నారు. ఎన్నారైలు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సినీ ప్రముఖులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో వాటికి వెళ్లడం మానుకున్నవారు కూడా ఉన్నారు.
-
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications