ద్వితీయ శ్రేణి తారలపైనే ఎన్నారైలకు మోజు, ఎందుకు?
చిరంజీవి, నాగార్జున వంటి నటులు గానీ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి మాస్ హీరోలు గానీ ఎన్నారైల కంటికి ఆనడం లేదు. ఈ ఏడాది ఎన్నారై సంఘాలు వారిని ఆహ్వానించలేదు. అమెరికాలోని రెండు తెలుగు సంఘాల వేడుకలకు వెళ్లిన 200 మందికి పైగా తారల్లో పేరున్న హీరోయిన్ శ్రియా శరన్ ఒక్కతే. మిగతా వారంతా బి - గ్రేడ్, సి - గ్రేడ్ తారలే. హైదరాబాదులో వ్యభిచారం కేసులో పట్టుబడిన వర్ధమాన నటి జ్యోతి కూడా ఉంది. ఇందుకు కారణమేమిటో, ఇందులోని ఆంతర్యమేమిటో ఎవరికైనా ఇట్లే అర్థమై పోతుంది. ఈ ఏడాది ఆటా వేడుకలకు సినీ ప్రముఖుల్లో బాలకృష్ణ మాత్రమే వెళ్లాడు. ఆయన తన క్యాన్సర్ ఆస్పత్రికి 60 లక్షల రూపాయలు విరాళంగా తెచ్చుకున్నారు. నాట్స్ వేడుకలకు రామ్ చరణ్ తేజ్ హాజరయ్యాడు.
అమెరికాలోని తానా రెండుగా చీలిపోయింది. దాని నుంచి చీలినవారు నాట్స్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి రెండు ఇటీవల పోటాపోటీగా వేడుకలు నిర్వహించుకున్నాయి. వాటిని నడిపేవారు మారారు. ఐటి వృత్తినిపుణులు, ఇంజనీర్లు, ఇతరులు ఆ సంస్థలను నడుపుతున్నారు. ఎన్నారైలు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సినీ ప్రముఖులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో వాటికి వెళ్లడం మానుకున్నవారు కూడా ఉన్నారు.