వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో భారత యువతి మృతి
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు నిచ్చెనలు వేసుకుని బస్సులోకి వెళ్లి ప్రయాణికులను కాపాడాయి. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను వెలికి తీశాయి. పిల్లర్ను బస్సు ఢీకొట్టగానే ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లింది. ఏడ్పులు, పెడబొబ్బలు వినిపించాయి.
ఏం జరిగిందో తెలిసే లోపలే పెద్ద శబ్దమై బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఢీకొట్టడానికి గల కారణాలపై లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తారని బస్సు కంపెనీ మెగాబస్ అధికార ప్రతినిధి చెప్పారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని అన్నారు.
గాయపడినవారిలో 33 మందిని అంబులెన్స్లో ఆస్పత్రులకు తరలించారు. హెలికాప్టర్లో ఇద్దరిని సెయింట్ లూయిస్ ఆస్పత్రికి, ముగ్గురిని స్ప్రింగ్ఫీల్డ్ ఆస్పత్రికి తరలించినట్లు కంపెనీ ప్రతినిధి చెప్పారు.
Comments
English summary
An Indian girl was killed and 38 people injured when a double decker bus apparently blew a tire, skidded and slammed into a pillar in the US state of Illinois. Illinois state police have identified the victim as Aditi Avhad, 24. Police said she was a native of India and was traveling to Columbia.
Story first published: Saturday, August 4, 2012, 13:58 [IST]