నివాళి: గోకుల్చాట్ పేలుళ్లకు ఏడేళ్లు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని గోకుల్చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లు జరిగి సోమవారానికి ఏడేళ్లు గడిచాయి. ఈ ఘటన 44 మంది అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, భజరంగ్ దళ్, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో లుంబినీ పార్క్, గోకుల్ చాట్లో సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు.
ఉగ్రవాదులు ఉన్మాదంతో ప్రజల ప్రాణాలను తీస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఎంపి దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. లుంబినీ పార్కులో బాంబు పేలుళ్లు జరిగి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం లుంబినీ పార్కులో సోమవారం బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మృతులకు నివాళులర్పించారు. భారత్ ఉగ్రవాదాన్ని తిప్పకొట్టగలదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
ఏడేళ్ల క్రితం జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్ట్ చేయలేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. సిపిఐ గ్రేటర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కోఠిలోని గోకుల్ చాట్ వద్ద చాట వెంకట్ రెడ్డి మృతులకు నివాళులర్పించారు. దోషులకు శిక్షపడితేనే మృతులకు నిజమైన నివాళి సమర్పించినట్లవుతుందని మృతుల కుటుంబసభ్యులు అన్నారు.
నివాళి
నగరంలోని గోకుల్చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లు జరిగి సోమవారానికి ఏడేళ్లు గడిచాయి. ఈ ఘటన 44 మంది అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుంది.
నివాళి
ఏడేళ్ల క్రితం జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్ట్ చేయలేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు.
నివాళి
సిపిఐ గ్రేటర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కోఠిలోని గోకుల్ చాట్ వద్ద చాట వెంకట్ రెడ్డి మృతులకు నివాళులర్పించారు.
నివాళి
దోషులకు శిక్షపడితేనే మృతులకు నిజమైన నివాళి సమర్పించినట్లవుతుందని మృతుల కుటుంబసభ్యులు అన్నారు.
నివాళి
భారతీయ జనతా పార్టీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, భజరంగ్ దళ్, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో లుంబినీ పార్క్, గోకుల్ చాట్లో సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు.
నివాళి
ఉగ్రవాదులు ఉన్మాదంతో ప్రజల ప్రాణాలను తీస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఎంపి దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు.
నివాళి
లుంబినీ పార్కులో బాంబు పేలుళ్లు జరిగి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం లుంబినీ పార్కులో సోమవారం బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
నివాళి
భారత్ ఉగ్రవాదాన్ని తిప్పకొట్టగలదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
నివాళి
లుంబినీ పార్కు, గోకుల్చాట్ పేలుళ్లలో మృతి చెందిన వారికి బిజెవైఎం ఆధ్వర్యంలో నాయకులు నివాళుర్పిస్తున్న దృశ్యం.
నివాళి
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, గ్రేటర్ బిజెపి అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, నాయకులు బద్దం బాల్ రెడ్డి, బిజెవైఎం గ్రేటర్ అధ్యక్షుడు ఆలె జితేంద్ర మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.