తేలనున్న జగన్, కాంగ్రెస్ బలాబలాలు

కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నప్పటికీ పలువురు స్థానిక ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జగన్ వెంట వెళ్లి పోయారు. దీంతో ఎన్నికలు కాంగ్రెస్ వైపు పూర్తిగా మొగ్గు చూపుతూ జరిగే అవకాశాలు లేవు. దీంతో తన బలాన్ని చూపించేందుకు జగన్ పలువురు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను తన వైపు తిప్పుకునేందుకు ప్రత్యక్ష కార్యాచరణలోకి దూకే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం తాను సూచించిన అభ్యర్థులకే ఓటు వేసేలా జగన్ పలువురిని కలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే జగన్ తన ప్రయత్నాల్లో తాను ఉన్నప్పటికీ కిరణ్ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది.
ఇప్పటి వరకూ స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వ్యూహరచనకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి గానీ, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి శ్రీనివాస్ గానీ రంగంలోకి దిగలేదని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలు వ్యయంతో కూడుకున్నవి కావడం కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. జగన్కు ధీటుగా ఖర్చు పెట్టగలమా అనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications