కేంద్రమంత్రి సీటుపై సబిత కొడుకు కన్ను
అమర్ కాలేకు పలువురు నేతలు జైపాల్ రెడ్డి పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జైపాల్ చేవేళ్ల నుండి గెలిచిన తర్వాత నియోజకవర్గానికి నిధులే రావడం లేదని పలువురు ఆరోపించారు. వచ్చేసారి ఆయనకు చేవెళ్ల టిక్కెట్ ఇవ్వవద్దని కోరారు. అతను ప్రజలతో కూడా నిత్యం టచ్లో ఉండరని అమర్ కాలేకు ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత కార్తీక్ రెడ్డి కలిసి చేవెళ్ల సీటు విషయంపై ఆయనకు చెప్పారట.
మరోవైపు సర్వే సత్యనారాయణ సీటు పైన కూడా కొందరి కన్ను పడిందట. వమల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అమర్ కాలేను కలిసిన అనంతరం మాట్లాడుతూ... తన సీటుకు కొందరు కోరుకుంటున్నారని, గత ఎన్నికల్లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనకు టిక్కెట్ ఇవ్వవద్దని చెప్పినప్పటికీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చారని, ఈసారి తనకే టిక్కెట్ ఇస్తారని, తాను ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు.
నగర పరిధిలో ఉన్న మల్కాజిగిరి, చేవెళ్లల నుండి బలమైన నాయకుడిని బరిలోకి దింపాలని అమర్ కాలేకు పలువురు సూచించారట. అంతేకాకుండా తెలంగాణపై ఏమీ తేల్చకుండా ఎవరిని నిలిపినా లాభం లేదని, తెలంగాణపై తేలిస్తేనే కాంగ్రెసు పార్టీకి ఇక్కడ భవిష్యత్తు ఉంటుందని కూడా పలువురు నేతలు అమర్ కాలేకు చెప్పారు.