Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రమంత్రి సీటుపై సబిత కొడుకు కన్ను

Jaipal Reddy - Karthik Reddy
హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కన్ను కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంపై పడినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుండి బరిలోకి దిగాలని అధిష్టానం ఆయనకు సూచనలు కూడా చేసిందట. ప్రస్తుతం చేవెళ్ల నుండి జైపాల్ రెడ్డి ప్రాతనిథ్యం వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దూత అమర్ కాలే వద్ద కార్తీక్ చేవెళ్ల టిక్కెట్ కావాలని కోరారట.

అమర్ కాలేకు పలువురు నేతలు జైపాల్ రెడ్డి పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జైపాల్ చేవేళ్ల నుండి గెలిచిన తర్వాత నియోజకవర్గానికి నిధులే రావడం లేదని పలువురు ఆరోపించారు. వచ్చేసారి ఆయనకు చేవెళ్ల టిక్కెట్ ఇవ్వవద్దని కోరారు. అతను ప్రజలతో కూడా నిత్యం టచ్‌లో ఉండరని అమర్ కాలేకు ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత కార్తీక్ రెడ్డి కలిసి చేవెళ్ల సీటు విషయంపై ఆయనకు చెప్పారట.

మరోవైపు సర్వే సత్యనారాయణ సీటు పైన కూడా కొందరి కన్ను పడిందట. వమల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అమర్ కాలేను కలిసిన అనంతరం మాట్లాడుతూ... తన సీటుకు కొందరు కోరుకుంటున్నారని, గత ఎన్నికల్లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనకు టిక్కెట్ ఇవ్వవద్దని చెప్పినప్పటికీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చారని, ఈసారి తనకే టిక్కెట్ ఇస్తారని, తాను ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు.

నగర పరిధిలో ఉన్న మల్కాజిగిరి, చేవెళ్లల నుండి బలమైన నాయకుడిని బరిలోకి దింపాలని అమర్ కాలేకు పలువురు సూచించారట. అంతేకాకుండా తెలంగాణపై ఏమీ తేల్చకుండా ఎవరిని నిలిపినా లాభం లేదని, తెలంగాణపై తేలిస్తేనే కాంగ్రెసు పార్టీకి ఇక్కడ భవిష్యత్తు ఉంటుందని కూడా పలువురు నేతలు అమర్ కాలేకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+