రేణుకా చౌదరి కత్తికి రెండు వైపులా పదును?
అయితే, రేణుకా చౌదరి రెండు వైపులా ఉండడానికి నిర్ణయించుకున్నారని గిట్టనివారు ఆమెపై వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలోని విభేదాలను రూపుమాపి, ఇరు ప్రాంతాల వారిని అభిప్రాయాలను వినడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎకె ఆంటోనీ కమిటీని వేశారు. ఆంటోనీ కమిటీకి ఎవరి అభిప్రాయాలు వారు చెబుకునే అవకాశం ఉంది.
బుధవారం రాత్రి తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. వీరితో రేణుకా చౌదరి ఎప్పుడూ కనిపించలేదు. కానీ, ఆంటోనీ కమిటీ ముందుకు ఆమె విడిగా ఆ రోజు వచ్చేశారు. దీన్నిబట్టి ఆమెను తెలంగాణవాదిగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆమె దానితో సరిపుచ్చకుండా, గురువారం రాత్రి ఆంటోనీ కమిటీతో సమావేశమైన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యుల సమావేశానికి కూడా ఆమె నేనున్నాఅంటూ వచ్చేశారు.
రేణుకా చౌదరి తీరును ఎవరే విధంగా తప్పు పట్టినా, సమర్థించినా ఆమె ఎఐసిసి అధికార ప్రతినిధి అనే విషయాన్ని మరిచిపోవద్దు. ఎఐసిసి ప్రతినిధిగా రెండు ప్రాంతాలకు ఆమె ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. విషయాలను పార్టీపరంగా చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా, రేణుకా చౌదరి కత్తికి రెండు వైపులా పదును ఉందని మాత్రం అందరికీ తెలుసు.