రేణుకా చౌదరి కత్తికి రెండు వైపులా పదును?

అయితే, రేణుకా చౌదరి రెండు వైపులా ఉండడానికి నిర్ణయించుకున్నారని గిట్టనివారు ఆమెపై వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలోని విభేదాలను రూపుమాపి, ఇరు ప్రాంతాల వారిని అభిప్రాయాలను వినడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎకె ఆంటోనీ కమిటీని వేశారు. ఆంటోనీ కమిటీకి ఎవరి అభిప్రాయాలు వారు చెబుకునే అవకాశం ఉంది.
బుధవారం రాత్రి తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. వీరితో రేణుకా చౌదరి ఎప్పుడూ కనిపించలేదు. కానీ, ఆంటోనీ కమిటీ ముందుకు ఆమె విడిగా ఆ రోజు వచ్చేశారు. దీన్నిబట్టి ఆమెను తెలంగాణవాదిగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆమె దానితో సరిపుచ్చకుండా, గురువారం రాత్రి ఆంటోనీ కమిటీతో సమావేశమైన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యుల సమావేశానికి కూడా ఆమె నేనున్నాఅంటూ వచ్చేశారు.
రేణుకా చౌదరి తీరును ఎవరే విధంగా తప్పు పట్టినా, సమర్థించినా ఆమె ఎఐసిసి అధికార ప్రతినిధి అనే విషయాన్ని మరిచిపోవద్దు. ఎఐసిసి ప్రతినిధిగా రెండు ప్రాంతాలకు ఆమె ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. విషయాలను పార్టీపరంగా చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా, రేణుకా చౌదరి కత్తికి రెండు వైపులా పదును ఉందని మాత్రం అందరికీ తెలుసు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications