వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పవన్ కళ్యాణ్ జనసేన నో: రెండు రాష్ట్రాల్లో జగన్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనను రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈసీ విడుదల చేసిన తాజా జాబితాలో జనసేన పార్టీ పేరు మాత్రం కనిపించలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసిన ఈ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన పార్టీగానే ఎన్నికల సంఘం పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ తన పార్టీ నమోదు విషయంలో ఎలా ముందుకు సాగుతారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది. తెలంగాణలో అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని మజ్లీస్ గుర్తింపు పార్టీగా అవతరించింది.
బీహార్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా, కేరళలో రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు సాధించాయి.
Comments
English summary
Pawan Kalyan's Jana Sena party missed in EC list. Where as YS jagan's YSR Congress party has been recognised in both the states, Andhra Pradesh and Telangana.