నగదు కొరత: నేతలు రూ.2000 నోట్లను దాస్తున్నారా?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరతకు కేవలం రిజర్వ్ బ్యాంక్ నుంచి నగదు రాకపోవడం మాత్రమే కారణం కాదని, దానికి ఇతర కారణాలున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బ్యాంకులు, ఎటిఎంలు తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నుంచి వస్తున్నప్పటికీ కొరత తీరడం లేదు.
ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డిఐ) కింది బెయిల్ - ఇన్ క్లాజ్ వల్ల డిపాజిట్లు కోల్పోతామనే భయం ప్రజలకు పట్టుకుంది. ఆ భయంతోనే బ్యాంకుల్లోని డబ్బులను తీసుకుంటున్నారు.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు రూ.2000 వేల నోట్లను దాచుకుంటున్నారని బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆరోపిస్తోంది. బ్యాంకుల వంటి సంస్థలు నష్టపోతే తీసుకునే చర్యల్లో డిపాజిటర్లు కూడా కొంత భరించాల్సి ఉంటుందనే ప్రతపాదన ఎఫ్ఆర్డిఐ బిల్లులో ఉండడమే ప్రజల భయాందోళనలకు కారణమని అంటున్నారు. దానిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిప్పటికీ భయాందోళనలు తొలగడం లేదు.
నగదు కొరత సంక్షోభంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసన మండలిలో వివణ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి సరిపోయినంత డబ్బు రావడం లేదని, ప్రల నుంచి బ్యాంకులకు వచ్చే డబ్బులు తగ్గిపోయాయని, పెద్ద నోట్లకు డిమాండ్ పెరిగిందని ఆయన అన్నారు
ఎటిఎంల్లో డబ్బులు ఉండడం లేదని, బ్యాంకులు నగదు ఇవ్వడం లేనదని, బ్యాంకుల నుంచి వెళ్తున్న డబ్బులు తిరిగి రావడం లేదని చెప్పారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications