వైయస్ గొప్పతనం కాదు: కెసిఆర్

ముఖ్యమంత్రి వైఎస్ వీసాపైనే తెలంగాణలో ఉన్నాడని, వైయస్ వీసా రద్దు చేయించే వరకు ఉద్యమ కార్యక్రమాలు ఆగవన్నారు. ప్రతి రోజు ఆదివారం కాదని సోమవారం కూడా ఉంటుందన్న ఆంగ్ల సామెతను వై.ఎస్.రాజశేఖర్రెడ్డిని ఉద్దేశించి కెసిఆర్ ప్రస్తావించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు యాదృచ్ఛికమేనని, ఆ పార్టీ గొప్పతనమేమీ లేదన్నారు. ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతోనే కాంగ్రెస్ బయటపడిందన్నారు.
పటేల్ సుధాకర్రెడ్డిని ఎన్కౌంటర్ చేయడాన్ని తెరాస ఖండించింది. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నది సమస్యలను పరిష్కరించదని కెసిఆర్ చెప్పారు. మావోయిస్టుల సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరమన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు అనాగరికమని, అశాస్త్రీయమని, ఆటవికమని అభివర్ణించారు.












Click it and Unblock the Notifications