న్యాయం జరగనందునే సమావేశాలు బహిష్కరిస్తున్నాం: టిఆర్ఎస్

నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణపై ప్రత్యేక తీర్మానం పెట్టిన తర్వాతే మరేదైనా పని చేయాలన్నారు. ఈ శాసనసభలో మాకు న్యాయం జరగదని తెలిసి బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఇంటర్ పరీక్షలను ఈ నెల 7వ తారీఖునుండి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం విడ్డూరమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడానికే ప్రభుత్వం పరీక్షలు ప్రారంభిస్తుందన్నారు. చలో హైదరాబాద్కు ఎలాంటి అనుమతి అవసరం లేదని మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. మార్చి 10న ప్రజలంతా రోడ్లపైనే వంటలు పెడతారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు సతీమణి కూడా రోడ్డుపైనే వంట చేస్తుందని అన్నారు. ఈ శాసనసభలో మా మొర విననందుకే బహిష్కరిస్తున్నామని చెప్పారు. చిదంబరం మాటలను నాయిని ఖండించారు.
కేంద్ర మంత్రి మతి లేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సంవత్సరం క్రితం ఆయనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చెప్పి ఇప్పుడు రాత్రికి రాత్రే రాదని చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన స్వయంగా చేసిన ప్రకటన ఆయన మర్చిపోయినా తెలంగాణ ప్రజలు మర్చి పోలేదన్నారు. ఆయన వెంటనే తన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. పుట్టినరోజులు, పెళ్లి పార్టీలు కూడా రోడ్డుపైనే చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications