హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు వద్దకు మంత్రి సుదర్శన్: కృష్ణ ట్రిబ్యునల్‌ చర్చకు పట్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sudarshan Reddy
హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు తదనంతర పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడటం వంటి పరిణామాల దృష్ట్యా భారీ నీటి పారుదల శాఖామంత్రి సుదర్శన్ రెడ్డి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

సమావేశాలు సాఫీగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు కృష్ణా తీర్పుపై ప్రభుత్వం తీరు సరిగా లేదని, భారీగా నీరు పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తేనే కృష్ణా నీటిలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. ట్రిబ్యునల్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేయాలని బాబు పట్టుబట్టారు. దీనికి మంత్రి సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 22న అఖిలపక్షం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

English summary
TDP president chandrababu naidu suggested state government that to put centre on krishna tribunal issue. Minister Sudarshan Reddy met Chadnrababu and urged for smooth sesstion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X