టెక్ మహింద్రా నష్టాలకు సత్యమే కారణం: టెక్ మహింద్రా
ఇటీవల మహింద్రా సత్యం ప్రకటించిన ఆర్థిక ఫలితాలలో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే గతంలో సత్యం కంప్యూటర్స్ తప్పుడు లెక్కలతో అమెరికా స్టాక్ మార్కెట్లో నష్టపోయిన వాటా దారులకు ఒకేసారి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని టెక్ మహింద్రా చెల్లించిందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సహజంగానే టెక్ మహింద్రా లాభాల్లో కోత పడిందని తెలిపాయి.
అంతేగాక ప్రత్యర్థి సంస్థలైన టీసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థల పోటీ కారణంగా ఉద్యోగులకు అధిక మొత్తంలో జీతభత్యాలు చెల్లించాల్సి వస్తోందని, అలాగే తక్కువ మొత్తాలకే పని చేయాల్సి వస్తోందని టెక్ మహింద్రా ఛీఫ్ ఫైనాన్షియల్ అధికారి సంజయ్ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం టెక్ మహింద్రా సంస్థలో 4,125 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, కొత్తగా ఈ త్రైమాసికంలో 15 క్లైయింట్లు చేరారన్నారు. మరోవైపు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్లో 0.3 శాతం మేర స్వల్పంగా నష్టపోయింది.