గాలి కస్టడీ పిటిషన్ వాయిదా, సోదరుడి పరామర్శ
కాగా గాలిని కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని రిమాండ్ రిపోర్టు అసంపూర్తిగా ఉందని గాలి తరఫున న్యాయవాది కోర్టులో తెలిపారు. చంచల్ గూడ జైలులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఆయన సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి బుధవారం వచ్చారు. భేటీ అనంతరం కాటసాని మాట్లాడుతూ గాలి తనకు బంధువని అందుకే కలిశానని చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఇతర విషయాల పట్ల తనకు అవగాహన లేదన్నారు. కాగా వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డి బుధవారం మరోసారి సిబిఐ ముందు హాజరయ్యారు. జగన్కు చెందిన భారతి సిమెంట్స్ ప్రతినిధులు, సరస్వతి పవర్ ప్రతినిధులు సైతం హాజరయ్యారు. జగన్ కేసులో వాణిజ్య పన్నుల శాఖ సిబిఐకి కీలక పత్రాలు అందజేసింది.