ముఖ్యమంత్రి పాల్గొంటే బాగుండేది: దానం నాగేందర్

సమ్మె చేస్తున్న తెలంగాణ ఉద్యోగులపై ప్రయోగిస్తామని తాము చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో సకల జనుల సమ్మె శాంతియుతంగా జరుగుతోందని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెను పరిష్కరించడానికి త్వరలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. తెలంగాణ విమోచన కోసం చేసిన త్యాగాలను ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కె. కేశవ రావు, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, దానం నాగేందర్ కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications