మలేషియన్లు సోషల్ మీడియాకు బానిసలయ్యారా..?
ఐతే మలేషియాలో ఫేస్బుక్ తన కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత ఆగస్టు నెల నుండి అక్కడున్న జనాభా ఫేస్బుక్కి బానిసలై 9.9 మిలియన్ సందర్శకులు ప్రతిరోజు సందర్శించడం వల్ల ఫేస్బుక్ గూగుల్ని అధిగమించి మలేషియా దేశంలో ఎక్కవ మంది యూజర్స్ దర్శించే వెబ్ సైట్లో మొదటి స్ధానంలో నిలిచింది.
మలేషియాలో ఉన్న టాప్ పది వెబ్ సైట్స్లను గనుక చూసినట్లేతే యాహు, మైక్రోసాప్ట్, వికీమీడియా(వికీపీడియా అనుబంధ సంస్ద), బ్లాగింగ్ వెబ్ సైట్ వర్డ్ ప్రెస్, మలేషియా లోకల్ సెల్లింగ్ సైట్ ముధ్.మై వెబ్ సైట్స్ కేవలం 2.5 మిలియన్ సందర్శకులతో తర్వాత స్దానాలలో నిలిచాయి. సోషల్ మీడియా వెబ్ సైట్స్లతో పోల్చితే వెబ్ ట్రాఫిక్ ఎక్కువగా ఎంటర్టెన్మెంట్ వెబ్ కంటెంట్(11.5%), పోర్టల్స్(11%), పాపులర్ ఇంటర్నెట్ డెస్టినేషన్స్ ఇనిస్టాంట్ మెసెంజర్(5.3%), వెబ్ ఆధారిత ఈమెయిల్(4.2%)ల ద్వారా వస్తుంది.
కామ్ స్కోర్ సంస్ద ఈ డేటాని ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. గూగుల్ వీడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన యూట్యూబ్కు కూడా ఫేస్ బుక్ తెలియకుండా దెబ్బ కొడుతుంది. ఏవిధంగా అని అనుకుంటున్నారా.. ఫేస్బుక్లో ఉన్న యూజర్స్ పొస్ట్ చేసిన వీడియోలను యూజర్స్ అమితంగా చూడడమే. ఇలా యూట్యూబ్ వీడియో(9మిలియన్)తో పోల్చితే ఫేస్బుక్ వీడియో శాతం(4.1మిలియన్)లతో రెండవ స్దానంలో ఉంది.