హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డి ఇక స్పెషల్ ఖైదీ, కోర్టు ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: గనుల అక్రమ తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చిన్నపాటి ఊరట లభించింది. గాలి జనార్దన్ రెడ్డిని, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డిని స్పెషల్ కెటగిరీ ఖైదీలుగా గుర్తించాలని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిద్దరిని హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఎ కెటగిరీ ఖైదీలుగా గుర్తిస్తారు. దీంతో వారికి ప్రత్యేకమైన సెల్ కేటాయిస్తారు. కొన్ని ప్రత్యేక వసతులు కూడా సమకూరుతాయి. ఇప్పటి వరకు వారిద్దరిని సాధారణమైన ఖైదీలుగానే గుర్తిస్తున్నారు.

తాము వ్యాపారవేత్తలం కాబట్టి తమను స్పెషల్ కెటగిరీ ఖైదీలుగా గుర్తించాలని గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దాన్ని సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. గాలి జనార్దన్ రెడ్డి ఓ సామాన్య కానిస్టేబుల్ కుమారుడని, పైగా అక్రమాలతో సొమ్ము కూడబెట్టాడని, అందువల్ల గాలి జనార్దన్ రెడ్డిని ప్రత్యేక కెటగిరీ ఖైదీగా గుర్తించకూడదని సిబిఐ వాదిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే, గాలి జనార్దన్ రెడ్డి మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం ఇది మూడోసారి.

English summary
Court ordered to give special category status to Gali Janardhan reddy and BV Srinivas Reddy in Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X