కోర్టులో సిబిఐ ఛార్జీషీట్: ఢీలా పడ్డ వైయస్ జగన్?

ఈ విషయాన్ని పక్కనే ఉన్న జిల్లా నేతలు జగన్కు తెలిపారట. ఇది వినగానే ఆయన ఒక్కసారిగా ఢీలా పడిపోయరట. విషయం తెలిసిన తర్వాత మరికొన్ని గంటల పాటు పర్యటించినా, ఎక్కడా కూడా నోరు విప్పి ఎక్కువగా మాట్లాడలేదట. చివరిలో ఒక బహిరంగ సభలో మాట్లాడినా సిబిఐ, ఛార్జీషీట్ వ్యవహారంపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదట. వచ్చే ఉప ఎన్నికలు మినీ ఎన్నికల లాంటివని, ఆ ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చి ఢిల్లీ పెద్దలకు వణుకు పుట్టించాలని కోరుతూ ప్రసంగాన్ని ముగించారట. ఆ సభ తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉన్నా, అర్ధాంతరంగా యాత్రను ముగించుకొని రాత్రి ఎనిమిది గంటల సమయంలో పార్టీకి చెందిన ఒక నేత ఇంటిలో బస చేసేందుకు వెళ్లిపోయారట.












Click it and Unblock the Notifications