హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్ 4న మందకృష్ణ మాదిగ రాజకీయ పార్టీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం డిసెంబర్ నాలుగో తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని, అదేరోజు ఎమ్మార్పీఎస్ పార్టీని ప్రకటిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సామాజిక న్యాయమే అజెండాగా తాము పార్టీని స్థాపిస్తున్నామన్నారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించిన విధంగా జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు అనే అంశానికి తాము మద్దతు ఇస్తున్నామన్నారు. వికలాంగులకు పెన్షన్ పెంచేది లేదని ప్రకటించడం మంత్రి సునితా లక్ష్మారెడ్డి అహంకారానికి నిదర్శనంగా ఉందని ఆయన అన్నారు.

వికలాంగుల పెన్షన్ 1500 రూపాయలకు పెంచాలనేది వికాలంగుల హక్కుల పోరాటసమితి ప్రధాన డిమాండ్ అని కాని రు.750 పెన్షన్ ఇస్తామనేది ప్రభుత్వ హామీ అని అన్నారు. తమ డిమాండ్ సంగతి అటుంచితే వారు ఇచ్చిన హామీని వారు నిలబెట్టుకుంటారో లేదోతేల్చకుండా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీతో తమకు సంబంధం లేదన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వికలాంగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని అన్నారు. ఒకవైపువికలాంగుల పెన్షన్ విషయంలో ప్రతిపక్షాల సూచనలు కూడా తీసుకుంటామని చెబుతూనే ప్రతిపక్షాలు ఈ విషయంలో అనవసర రాజకీయం చేస్తున్నాయని విమర్శించడం శోచనీయమని అన్నారు.

English summary
MRPS leader Manda Krishna Madiga will announce political party on December 4. He will organise chalo Hyderabad on that day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X