ఆసక్తికరం:సీఎం చంద్రబాబుతో ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ భేటీ;మంత్రులేమన్నారంటే?...
అమరావతి:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత, మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతిలోని సీఎం కార్యాలయంలో గురువారం చంద్రబాబుతో అజిత్ సింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం అజిత్ సింగ్ ను సత్కరించిన చంద్రబాబు ఆయనకు బుద్దుడి జ్ఞాపికను బహూకరించారు. సిఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన అజిత్ సింగ్ వెంట మాజీ ఎంపి యలమంచిలి శివాజీ కూడా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను సమాయత్తం చేస్తున్న చంద్రబాబుతో ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, రాష్ట్రీయ లోకదళ్ నాయకుడు అజిత్ సింగ్ ల మధ్య సమావేశం సందర్భంగా దేశ రాజకీయాల గురించి విస్తృత చర్చ జరిగివుంటుందని అందరూ భావిస్తున్నారు. దీంతో ఈ భేటీ పై అమిత్ షా కూడా అరా తీసినట్లు తెలిసింది. అమరావతి దాకా వెళ్లి చంద్రబాబుని అజిత్ సింగ్ కలవాల్సిన అవసరం ఏముంది అంటూ అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది.

జాతీయ రాజకీయాల్లో గత రెండు నెలలుగా యాక్టివ్ గా వర్క్ చేస్తున్న చంద్రబాబు ఇప్పటికే 17 పార్టీలతో చర్చించారు. వారం కిందటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడ వచ్చి చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. వారిరువురూ కూడా ప్రధానంగా జాతీయ రాజకీయాలపైనే చర్చించినట్లు తెలిసింది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఆర్ఎల్డీ నాయకుడు అజిత్ సింగ్ అమరావతి రావటంతో సిఎం చంద్రబాబు భేటీలు చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలావుంటే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టకోబోతోందన్న ప్రచారంపై మంత్రి పితాని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. పొత్తుల అంశంపై గురువారం రాత్రి 11 గంటల వరకు మంత్రుల సమావేశం జరిగిందని...నేతలందరికీ సీఎం చంద్రబాబు ఒక డైరెక్షన్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో పూర్తి నిర్ణయాధికారం అధ్యక్షుడికే వదిలేశామని పితాని స్పష్టం చేశారు. అలాగే మరోమంత్రి యనమల తెలంగాణాలో ముందస్తు ఎన్నికల విషయమై మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లినట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications