అవసరం లేకున్నాఅంత పెట్టి కొన్నారెందుకు?...విద్యుత్ కొనుగోళ్లపై సిఎస్ ఆగ్రహం
అమరావతి: ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు ఒక విషయమై కోపం వచ్చిందట. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ మన విద్యుత్ సంస్థలు ఎక్కువ ధర పెట్టి ప్రైవేట్ విద్యుత్ కంపెనీల నుంచి కరెంట్ కొనుగోళ్లు చేయడమే ఆయన ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.
ఎపిలో మిగులు కరెంట్ పరిస్థితి ఉండటం...పైగా దేశంలో మిగతా చోట్ల కూడా విద్యుత్ కు పెద్దగా డిమాండ్ లోకపోయినా...ఏదో తీవ్రమైన పోటీ ఉన్నట్లు విద్యుత్ ను అత్యధిక ధరతో కొనుగోలుకు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకోవడంతో ఆయనకు చాలా ఆగ్రహం కలిగిందట. అందువల్ల ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణించిన ఆయన దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా సంబంధిత డిస్కమ్స్ అధికారులను ఆదేశించారట.

ఇప్పటికే ఎపి డిస్కమ్స్ ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు నష్టాల్లోకి కూరుకుపోతున్నాయని, అలాంటి సమయంలో ఆచితూచి స్పందించాల్సింది పోయి ఇలా బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారట. విద్యుత్ డిమాండ్ లేని ఈ తరుణంలో కూడా ఎక్కువ ధర పెట్టి కొనుగోళ్లు జరపడం వల్లే డిస్కమ్స్పై పెనుభారం పడుతోందని సిఎస్ అన్నారట. ఈ నేపధ్యంలో ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నింటినీ తిరిగి సమీక్షించాలని సీఎస్ స్పష్టం చేసినట్లు తెలసింది. దీంతో ఈ ఒప్పందం లో కీలకంగా పనిచేసిన అధికారుల్లో ఆందోళన మొదలైందని అంటున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications