వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో ఏపీని పురోగతి దిశగా అడుగులు వేయించే కార్యక్రమాన్ని చేపట్టింది. పారిశ్రామికంగా ఏపీ ప్రగతి సాధిస్తే, తద్వారా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం అనేక కంపెనీలను ఏపీకి స్వాగతిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ సర్కార్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేని యువత ఉండకుండా తనవంతు ప్రయత్నం చేస్తుంది.
20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యం పెట్టుకోవాలన్న మంత్రి
ఈ క్రమంలో తాజాగా వచ్చే ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని ఏపీ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నేడు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల మంత్రి నారా లోకేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు.

అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యుత్తమ చిరునామాగా ఏపీ
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం చేరుకోవడంలో ఏపీఈడీబీ పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ పెద్ద లక్ష్యం విజయవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యుత్తమ చిరునామాగా మార్చే ప్రక్రియలో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
రాబోయే ఐదేళ్లలో ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. నిరుద్యోగులకు మనం ఇచ్చిన హామీ మేరకు రాబోయే ఐదేళ్లలో లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, ఆ తర్వాతి కాలంలో అంతకు మించిన విజయాలను నమోదు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధన కోసం జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి
కింది స్థాయిలో MSME గురించి అవగాహన కల్పించాలని, ఇందుకోసం కలెక్టర్లతో పాటు అన్ని శాఖల సహకారం తీసుకుని సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు పటిష్టం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు కావాల్సిన సంపూర్ణ సహకారం అందిస్తోందని ఆయన తెలిపారు. ఇది గుర్తించే ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇది మనమందరం గర్వించాల్సిన విషయం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయంలో కష్టపడుతోన్న సంబంధిత శాఖాధికారులను కూడా మంత్రి అభినందించారు.
-
మంత్రాలయం వెళ్లేవారికి గుడ్ న్యూస్.. నేషనల్ హైవే 167పై కొత్తగా బైపాస్! -
ఎగ్జామ్ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు.. DON'T MISS -
నెలకు రూ.55,932 జీతంతో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే ?? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే?












Click it and Unblock the Notifications