నేడు ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ: వీటిపైనే ప్రధాన చర్చ, వైసీపీపైనా..
అమరావతి: మార్చి 5 నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలోని గ్రీవెన్స్ హాలులో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

మరోసారి ఒత్తిడి పెంచే అవకాశం
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పార్లమెంట్ బయట, లోపలా ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మరోసారి అదే విధానాన్ని కొనసాగేంచే అవకాశంపై చర్చించనున్నారు.
Recommended Video


ఇతర పార్టీల విధానాలపైనా
కాగా, బడ్జెట్ సమావేశాలు వాయిదా పడినందున ఆ పోరాటానికి తాత్కాలికంగా విరామం వచ్చింది. అయితే, మళ్లీ మార్చి 5 నుంచి సమావేశాలు జరగనున్నందున విభజన హామీలతో పాటు రాష్ట్రానికి ప్రకటించిన హామీలన్నింటినీ సాధించేందుకు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని, రాష్ట్ర హక్కుల సాధన, వివిధ పార్టీలు అనుసరిస్తున్న విధానంపైనా చర్చించే అవకాశం ఉంది.

ఏ త్యాగానికైనా సిద్ధమని..
రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే రాజీనామాలకు కూడా వెనుకాడబోమని, ఏ త్యాగానికైనా సిద్ధమని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ముందుకు ఎలా?
ఎంపీలతో రాజీనామాతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెడతామని ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపైనా ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications