రైతాంగం కోసం సీఎం విజ్ఞప్తి… రూ.200 కోట్ల సహాయం!
రాష్ట్ర రైతుల భవిష్యత్తే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. ముఖ్యంగా సేంద్రీయ సాగు, సహజ వ్యవసాయం, పంటల ధరల స్థిరత్వం వంటి అంశాలు రైతులకు ఎంత కీలకమో వివరిస్తూ కేంద్రం నుంచి మరింత మద్దతు అవసరమని స్పష్టం చేశారు.
రైతులకు ఖర్చు తగ్గి లాభం పెరగాలన్న లక్ష్యంతో రాష్ట్రం సేంద్రీయ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చంద్రబాబు తెలిపారు. PM-PRANAM పథకం కింద ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ను మరింత విస్తరించేందుకు నిధులు ఇవ్వాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగాన్ని 2024-25లో 2.28 శాతం తగ్గించామని, దీనికి గాను కేంద్రం ఇవ్వాల్సిన రూ.216 కోట్ల ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు 8 లక్షల హెక్టార్లలో సేంద్రీయ సాగుకు ముందుకు రావడం రైతుల్లో మార్పు స్పష్టంగా చూపుతోందని సీఎం పేర్కొన్నారు.

అదేవిధంగా కొబ్బరి రైతుల అభివృద్ధిపై సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి సాగు బలోపేతానికి రూ.200 కోట్ల సహాయం, కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, కర్ణాటక తరహాలో ఆధునిక టెండర్ కోకోనట్ మార్కెట్లు, రైతులకు శిక్షణ, నర్సరీల విస్తరణకు సహకరించాలని కోరారు. ఇవి అమలైతే సుమారు 15 వేల మందికి ఉపాధి, రైతులకు స్థిర ఆదాయం లభిస్తుందని వివరించారు. అలాగే పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద పెండింగ్లో ఉన్న రూ.695 కోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
పంటల ధరలు పడిపోయి నష్టపోయే రైతులకు రక్షణగా ఉన్న ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టంపై కూడా సీఎం గట్టిగా నిలబడ్డారు. 2025-26 సీజన్కు సంబంధించి తోతాపూరి మామిడికి కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.100 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే కేంద్ర వాటా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు చెల్లింపులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు, కొల్లేరు ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల వాతావరణం ఉందని, ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి రైతులకు కొత్త ఆదాయ మార్గాలు తెరవాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు.
మొత్తంగా ఈ భేటీ రైతుల ఖర్చు తగ్గింపు, ఆదాయం పెంపు, మార్కెట్ భద్రత, కొత్త పంటల ప్రోత్సాహం అనే నాలుగు స్తంభాలపై సాగిందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా?












Click it and Unblock the Notifications