రేణిగుంట మల్లాది ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు
చిత్తూరు: జిల్లాలోని రేణిగుంట పారిశ్రామికవాడలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లాది డ్రగ్స్ ఫార్మాసూటికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో పదిమంది గాయాలపాలయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

కాగా, ఘటన జరిగిన సమయంలో కంపెనీలో మొత్తం 12మంది ఉండగా, వారిలో మంటల్లో చిక్కున్న పది మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కెమికల్స్ తయారు చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అనుభవం లేని సిబ్బందితో పని చేయిస్తున్న కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నట్లు సమాచారం.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications