రెవెన్యూ, పోలీస్ శాఖల్లో బదిలీలు, ఒకేసారి అన్ని స్థాయిల్లో.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
రెండ్రోజుల్లో రెవెన్యూ, పోలీస్ శాఖలో బదిలీలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
అమరావతి: రెండ్రోజుల్లో రెవెన్యూ, పోలీస్ శాఖలో బదిలీలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో ఐపిఎస్ బదిలీలపై సమావేశం నిర్వహించారు.
ఐజీలు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలను ఒకేసారి బదిలీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎంతోకాలంగా ఫెండింగ్లో ఉన్న ఆర్డీవోల బదిలీ ప్రక్రియకు సంబంధించి ప్రతిపాదనలు సోమవారం ఉదయానికి తనకు అందచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

బదిలీ అయ్యే ఎస్పీలు, కొత్తగా వచ్చే ఎస్పీలు..రేంజ్ ఐజీలు, డీఐజీలతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడనున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రంలోపు అందరితో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో డిజిపి సాంబశివరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీశ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications