మీడియా ముందే తేల్చుకుందాం...రండి:విపక్షాలకు లోకేష్ సవాల్
విజయవాడ:తమపై విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై మీడియా ఎదుట చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాల్ చేశారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
ప్రత్యేకహోదా ఇవ్వని ప్రధాని మోడీని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, జగన్ ఎందుకు విమర్శించడంలేదని లోకేష్ ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెడతామని లోకేష్ తెలిపారు. వైసీపీ ఎంపీలు పోరాడకుండా రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతి అంతర్జాతీయ క్రియేటివిటీ సెంటర్గా ఎదగాలని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆరో డివిజన్లో గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం 150 రోజుల పాటు కొనసాగుతుందన్నారు.
చంద్రబాబు పాలనపై 90 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరించడం గొప్ప విషయమని బుద్దావెంకన్న గ్రామదర్శిని కార్యక్రమం గురించి చెప్పుకొచ్చారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications