మీడియా ముందే తేల్చుకుందాం...రండి:విపక్షాలకు లోకేష్ సవాల్
విజయవాడ:తమపై విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై మీడియా ఎదుట చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాల్ చేశారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
ప్రత్యేకహోదా ఇవ్వని ప్రధాని మోడీని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, జగన్ ఎందుకు విమర్శించడంలేదని లోకేష్ ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెడతామని లోకేష్ తెలిపారు. వైసీపీ ఎంపీలు పోరాడకుండా రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతి అంతర్జాతీయ క్రియేటివిటీ సెంటర్గా ఎదగాలని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆరో డివిజన్లో గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం 150 రోజుల పాటు కొనసాగుతుందన్నారు.
చంద్రబాబు పాలనపై 90 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరించడం గొప్ప విషయమని బుద్దావెంకన్న గ్రామదర్శిని కార్యక్రమం గురించి చెప్పుకొచ్చారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications