దేవుడికే డబ్బు కష్టాలు, రూ.127 కోట్ల పాత నోట్ల మార్పిడికి 'నో' : ఆర్ బి ఐ
ఆపదలో ఉన్నవాడి కష్టాలు తీర్చే ఆపద మొక్కుల వాడికి పేరున్న తిరుపతి వెంకటేశ్వరస్వామికి డబ్బు కష్టాలు వచ్చాయి. ఈ కష్టాల నుండి గట్టెక్కించాలని టిటిడి పాలకవర్గం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
తిరుమల: ఆపదలో ఉన్నవాడి కష్టాలు తీర్చే ఆపద మొక్కుల వాడికి పేరున్న తిరుపతి వెంకటేశ్వరస్వామికి డబ్బు కష్టాలు వచ్చాయి. ఈ కష్టాల నుండి గట్టెక్కించాలని టిటిడి పాలకవర్గం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
ఆపదలో ఉన్నవాడి కష్టాలు తీర్చుతాడని తిరువతి వెంకటేశ్వరస్వామిని భక్తులు విశ్వసిస్తారు.అందుకే తాము ఆపదలో ఉన్నసమయంలో ఆ దేవుడికి మొక్కుకొంటారు.
అయితే గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేసింది. ఈ నోట్ల రద్దు కారణంగా చాలా మంది భక్తులు రద్దుచేసిన నగదు నోట్లను తిరుపతి హుండీల్లో వేశారు.
ఇప్పటికే 127 కోట్ల రూపాయాలు హుండీ ద్వారా రద్దు చేసిన నగదు నోట్లు ఉన్నాయి.అయితే గడువు మించి పోయినందున ఈ నగదును మార్పిడి చేసేందుకు ఆర్ బి ఐ మాత్రం ఒప్పుకోవడం లేదు.
దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని టిటిడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రద్దు చేసిన రూ.127 కోట్ల నగదును తీసుకొని తమకు కొత్త నోట్లను ఇవ్వాలని ఆర్ బి ఐ పై ఒత్తిడి తేవాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది టిటిడి.