హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మొత్తం ఆస్తులజప్తు ఎప్పుడు: సిబిఐకి యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Yanamala questions CBI
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల పైన మూడేళ్లుగా విచారణ జరిపి రూ.1,100 కోట్ల విలువైన ఆస్తులను జఫ్తు చేశారని, మిగిలన రూ.41,900 కోట్ల ఆస్తులను ఎప్పుడు జఫ్తు చేస్తారని సిబిఐ, ఈడిలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గురువారం ప్రశ్నించారు.

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా రూ.43 వేల కోట్లు సంపాదించినట్టు అఫిడవిట్‌లో సిబిఐ పేర్కొందన్నారు. జగన్ అక్రమ సంపాదనలో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇప్పటి వరకు రూ.11 వందల కోట్లు మాత్రమే జప్తు చేసిందని, మిగిలిన వాటిని ఎప్పుడు జప్తు చేస్తారన్నారు.

లక్ష కోట్ల రూపాయల ఆస్తులను జగన్ కూడబెట్టినట్టు 2009లో టిడిపి సాక్ష్యాధారాలతో సహా దర్యాప్తు సంస్థలకు అందజేసిందని ఆయన పేర్కొన్నారు. తాము సాక్ష్యాధారాలు అందజేసిన వాటిలో రూ.43 వేల కోట్లను మాత్రమే సిబిఐ గుర్తించిందని, మిగిలిన రూ. 57 వేల కోట్లు ఏమయ్యాయని యనమల ప్రశ్నించారు.

ఏడాదికి రూ. 300 కోట్ల చొప్పున జప్తు చేస్తే ఇంత పెద్ద మొత్తాన్ని జప్తు చేయడానికి ఎన్నేళ్ళు పడుతుందన్నారు. వైయస్ హయాంలో 2.70 లక్షల ఎకరాల భూములను అక్రమంగా కేటాయించగా, ఇప్పటి వరకు 1,699 ఎకరాలను మాత్రమే జప్తు చేశారని, మిగిలిన 2,68,301 ఎకరాలను ఎప్పుడు జప్తు చేస్తారన్నారు.

శాసనసభ టికెట్‌కు రూ.10 కోట్లు, లోక్‌సభ టికెట్‌కు రూ.100 కోట్ల చొప్పున ఇప్పటికే వసూలు చేసిన డబ్బును జగన్ వ్యాపార సంస్థలకు, పవర్ ప్లాంట్లకు మళ్లించినట్లు తెలుస్తోందని, ఈ వసూళ్లపై కూడా తక్షణమే విచారణ ప్రారంభించాలని యనమల డిమాండ్ చేశారు. ఎన్నికల పేరుతో వసూలు చేసిన డబ్బును కూడా సిబిఐ, ఈడి జప్తు చేయాలని కోరారు.

English summary
Telugudesam Party senior leader Yanamala Ramakrishnudu on Thursday questioned CBI about YS Jagan assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X