జగన్ మొత్తం ఆస్తులజప్తు ఎప్పుడు: సిబిఐకి యనమల

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా రూ.43 వేల కోట్లు సంపాదించినట్టు అఫిడవిట్లో సిబిఐ పేర్కొందన్నారు. జగన్ అక్రమ సంపాదనలో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇప్పటి వరకు రూ.11 వందల కోట్లు మాత్రమే జప్తు చేసిందని, మిగిలిన వాటిని ఎప్పుడు జప్తు చేస్తారన్నారు.
లక్ష కోట్ల రూపాయల ఆస్తులను జగన్ కూడబెట్టినట్టు 2009లో టిడిపి సాక్ష్యాధారాలతో సహా దర్యాప్తు సంస్థలకు అందజేసిందని ఆయన పేర్కొన్నారు. తాము సాక్ష్యాధారాలు అందజేసిన వాటిలో రూ.43 వేల కోట్లను మాత్రమే సిబిఐ గుర్తించిందని, మిగిలిన రూ. 57 వేల కోట్లు ఏమయ్యాయని యనమల ప్రశ్నించారు.
ఏడాదికి రూ. 300 కోట్ల చొప్పున జప్తు చేస్తే ఇంత పెద్ద మొత్తాన్ని జప్తు చేయడానికి ఎన్నేళ్ళు పడుతుందన్నారు. వైయస్ హయాంలో 2.70 లక్షల ఎకరాల భూములను అక్రమంగా కేటాయించగా, ఇప్పటి వరకు 1,699 ఎకరాలను మాత్రమే జప్తు చేశారని, మిగిలిన 2,68,301 ఎకరాలను ఎప్పుడు జప్తు చేస్తారన్నారు.
శాసనసభ టికెట్కు రూ.10 కోట్లు, లోక్సభ టికెట్కు రూ.100 కోట్ల చొప్పున ఇప్పటికే వసూలు చేసిన డబ్బును జగన్ వ్యాపార సంస్థలకు, పవర్ ప్లాంట్లకు మళ్లించినట్లు తెలుస్తోందని, ఈ వసూళ్లపై కూడా తక్షణమే విచారణ ప్రారంభించాలని యనమల డిమాండ్ చేశారు. ఎన్నికల పేరుతో వసూలు చేసిన డబ్బును కూడా సిబిఐ, ఈడి జప్తు చేయాలని కోరారు.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications