కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళనకు వైసీపీ మద్దతు: పార్థసారథి
విజయవాడ: కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల తొలగింపుకు ఏపీ ప్రభుత్వం సిద్దపడటాన్ని వైసీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారంనాడు విజయవాడలో పార్థసారథి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయంలో 143వ, జివో ద్వారా ఎనిమిదివేల మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను నియమించారని ఆయన గుర్తుచేశారు.
ఇంటర్మీడియట్ వ్యవస్థకు కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు మూలస్థంబాలుగా నిలుస్తారని పార్థసారథి అభిప్రాయడ్డారు. ఒక్కొక్కరూ పదేళ్ళ సీనియారిటీతో పనిచేస్తున్నారని, వారిని అర్థాంతరంగా తొలగించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం సిద్దపడటాన్ని ఆయన తప్పుబట్టారు.

వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కాంట్రాక్ట్ లెక్చర్లకు న్యాయం జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే వారి జీతాలను రూ.9 వేల నుండి రూ.18వేలకు పెంచినట్టు పార్థసారథి గుర్తుచేశారు.
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారన్నారు. ఎన్నికల్లో ఒప్పంద ఉద్యోగులకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు అనేకహమీలను ఇచ్చిన చంద్రబాబునాయుడు హమీలను విస్మరించారని పార్థసారధి ఆరోపించారు.
కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ కోసం చేసే ఉద్యమానికి వైసీపీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోందని ఆయన ప్రకటించారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications