హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉగ్రదాడి ఖండించిన కేసీఆర్.. పుట్టినరోజు వేడుకలకు దూరం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేశారనే విషయం తెలియగానే తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. ఇంకా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయనే సమాచారం రావడంతో కలత చెందినట్లు చెప్పారు.

cm kcr denied terrorist attack, no birthday celebrations

ఉగ్రదాడిలో జవాన్లు మృతిచెందడంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొందని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఆ క్రమంలో ఈనెల 17న తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్నారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించరాదని కోరారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ క్యాడర్ సన్నద్ధమైంది. పలుచోట్ల ఫ్లెక్సీలు కూడా ప్రింట్ వేయించారు. ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో దాదాపు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన కారణంగా 40కి పైగా జవాన్లు మృత్యువాత పడటంతో.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు క్యాడర్ కూడా ఎలాంటి వేడుకలు జరపొద్దని సూచించారు. అధినేత ఆదేశాలతో పార్టీ కార్యకర్తలు కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండబోతున్నారు.

English summary
Telangana CM KCR denied terrorist attack. He called up cadre to not celebrate his birthday celebrations on febraury 17th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X