ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం.. ఇక ఎమ్మెల్యేల వంతు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ప్రొటెం స్పీకర్ పదవి దక్కుతుండటం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు ఆ బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
గురువారం (17వ తేదీ) నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణాల స్వీకారాలు జరగనున్నాయి. దానికి ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు సీఎం కేసీఆర్.
11 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి.

18వ తేదీ శుక్రవారం నాడు స్పీకర్ ఎన్నిక జరగనుంది. 19వ తేదీ శనివారం నాడు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మండలి సమావేశం మొదలవుతుంది. అదే రోజు ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. 20వ తేదీ ఆదివారం నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications