జయలలిత మేనకోడలు దీపా ఇంటి రచ్చ: చంపేస్తామంటున్నారని కేసు పెట్టిన భర్త మాధవన్!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా ఇంటి రామాయణం మళ్లీ పోలీస్ స్టేషన్ కు చేరింది. తనను చంపేస్తానని దీపా కారు డ్రైవర్ రాజా బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాలని ఆమె భర్త మాదవన్ శనివారం చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జయలలిత మరణించిన తరువాత దీపా వెలుగులోకి వచ్చారు. రాజకీయంగా ఎదగాలని దీపా ప్రయత్నించారు. దీపా వెంటనే ఆమె భర్త కూడా ఉన్నాడు. అయితే రాజకీయంగా తనకంటే కారు డ్రైవర్ రాజాకు తన భార్య దీపా ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నదని మాధవన్ సహించలేకపోయాడు.

ఇదే విషయంలో చాలాసార్లు దీపా, మాధవన్ ల మధ్య గొడవ జరిగింది. ఓ సారి డ్రైవర్ రాజా, దీపా మద్దతుదారులు ఇంటిలోకి వెళ్లడానికి ప్రయత్నించి ఆమె భర్త మాదవన్ ను గేట్ దగ్గరే అడ్డుకోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో దీపా ఇంటిలో మీడియా సమావేశం నిర్వహిస్తుండంతో విషయం బయటకు తెలిసి రచ్చరచ్చ అయ్యింది.
ఇప్పుడు దీపా కారు డ్రైవర్ రాజా తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాలని మనవి చేస్తూ మాధవన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై మాట్లాడటానికి జయలలిత మేనకోడలు దీపా నిరాకరించారు. మొత్తం మీద అమ్మ జయలలిత మేనకోడలు దీపా ఇంటిగుట్టు మరోసారి రోడ్డు మీదకు వచ్చింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications