Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మా ప్రభుత్వంలో మా కార్యకర్తలకే భద్రత లేదు. సిగ్గుగా ఉంది, ఎన్ఐఏ విచారణకు కేంద్ర మంత్రి డిమాండ్ !

బెంగళూరు/ శివమొగ్గ: భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురి కావడంతో శివమొగ్గ పట్టణం అట్టుడికిపోతోంది. భజరంగ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాకు చెప్పారు. హర్షా హత్య కేసులో మొత్తం ఐదు మంది ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారని, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాకు చెప్పారు. మా ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో మా కార్యకర్తలు దారుణ హత్యకు గురికావడంతో మేము సిగ్గుతో తల దించుకుంటున్నామని బీజేపీ ఎంపీ అన్నారు. సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు కాపాడలేని మేము ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తామని, మేము చెప్పినప్పుడే రాష్ట్రంలో ఎస్ డీపీఐ సంస్థను నిషేధించి ఉంటే భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురై ఉండేవాడు కాదని, ఇది మేము చేసిన తప్పే అంటూ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కర్ణాటకలో అధికారంలో ఉన్న సొంత పార్టీ మీద ఆరోపణలు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు ఎన్ఐఏకి అప్పగించాలని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.

హత్య కేసులో ఎవరెవరు ఉన్నారు ?

హత్య కేసులో ఎవరెవరు ఉన్నారు ?


భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురి కావడంతో శివమొగ్గ పట్టణం అట్టుడికిపోతోంది. భజరంగ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాకు చెప్పారు. హర్షా హత్య కేసులో మొత్తం ఐదు మంది ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారని, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాకు చెప్పారు. శివమొగ్గతో పాటు కర్ణాటకలో రెండు మూడు రోజులు మనం అప్రమత్తంగా ఉండాలని హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు.

మాకే సిగ్గుగా ఉంది

మాకే సిగ్గుగా ఉంది

మా ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మా కార్యకర్తలు దారుణ హత్యకు గురికావడంతో మేము సిగ్గుతో తల దించుకుంటున్నామని మైసూరు-కొడుకు లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సొంత పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ

సొంత పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ

సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు కాపాడలేని మేము ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తామని, మేము చెప్పినప్పుడే రాష్ట్రంలో ఎస్ డీపీఐ సంస్థను నిషేధించి ఉంటే భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురై ఉండేవాడు కాదని, ఇది మేము చేసిన తప్పే అంటూ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కర్ణాటకలో అధికారంలో ఉన్న సొంత పార్టీ మీద ఆరోపణలు చేశారు.

 ఎన్ఐఏ విచారణకు కేంద్ర మంత్రి డిమాండ్

ఎన్ఐఏ విచారణకు కేంద్ర మంత్రి డిమాండ్

శివమొగ్గలో హత్యకు గురైన భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసు ఎన్ఐఏకి అప్పగించాలని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలను కాపాడుకోవడం మా బాధ్యత అని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు ఎదురుకాకుండా ప్రభుత్వం చూసుకోవాలని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే అన్నారు.

 సినిమా చూపించిన కార్యకర్తలు

సినిమా చూపించిన కార్యకర్తలు

భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురి కావడంతో శివమొగ్గ పట్టణం రణరంగంగా మారిపోయింది. వేలాది మంది ఒకేసారి ఊరేగింపుగా బయలుదేరడంతో పలువురు సహనం కోల్పోయి ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ల మీద రాళ్ల వర్షం కురిపించారు. ఓ వర్గానికి చెందిన వారి షాపులు ఆస్తులు ధ్వంసం చేశారు. కార్లకు నిప్పంటించారు. తోపుడు బండ్లకు నిప్పంటించారు కాల్చి బూడిద చేశారు. ఆ సమయంలో అడ్డు వెళ్లిన పోలీసుల మీద రాళ్ల వర్షం కురించారు. పరిస్థితి చెయ్యిదాటడంతో పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+