షాక్లో బెంగళూరు రేప్ విక్టిం: ఫ్రెండ్ చెప్తే విన్లేదు! వ్యాన్లో కన్నడ సాంగ్స్
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో కాల్ సెంటర్ ఉద్యోగిని పైన ముగ్గురు యువకులు వ్యాన్లో తిప్పుతూ రెండు గంటల పాటు అత్యాచారానికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. ఆమె పని చేసే కంపెనీకి రవాణా వ్యవస్థ ఉండి ఉంటే ఇది ఇది తప్పేదని చెబుతున్నారు.
ఆమె పని చేసేది ఓ చిన్న స్థాయి బిపివో సంస్థ అని చెబుతున్నారు. ఆమె పని చేసే కంపెనీకి ఎలాంటి రవాణా వ్యవస్థ లేదు. ఆమె సొంతగానే ఇంటికి వెళ్ల వలసి ఉంటుందని సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిణి కొటక్ చెప్పారు.
కంపెనీలు విధులు ముగించుకున్నాక బాధితురాలు మరో సహోద్యోగిణితో (స్నేహితురాలు కూడా) కలిసి బయటకు వచ్చారు. ఇంటికి వెళ్లేందుకు ఆటో రిక్షా కోసం చూశారు. అంతలోనే, వ్యాన్ వచ్చి ఆగింది. మేం మడివాలా (బాధితురాలు ఉండే ప్రాంతం) దింపుతామని వ్యాన్లో ఉన్న నిందితులు చెప్పారు.
ఎంతకూ ఆటోలు కనిపించక పోవడం, వ్యాన్ రావడం.. అయినప్పటికీ ఆటోలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో బాధితురాలు వ్యాన్ ఎక్కారు. అయితే, ఆమెతో పాటు ఉన్న స్నేహితురాలు.. వ్యాన్ లోపల ఎవరూ లేకపోవడం చూసి, బాధితురాలి ఆపే ప్రయత్నం చేశారు.
వ్యాన్లో ప్రయాణీకులు ఎవరూ లేరని స్నేహితురాలు చెప్పి ఆమెను ఎక్కకుండా చేయాలని చూసిందని, కానీ బాధితురాలు ఇంటికి వెళ్లే ఉద్దేశ్యంతో ఆ వ్యాన్ ఎక్కిందని పోలీసులు చెప్పారు.

గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు
వ్యాన్ డ్రైవర్ తాను దిగవలసిన మాడివాలా ప్రాంతంలో ఆపలేదని, ఎవరూ లేని ప్రాంతంలో తిప్పారని, చాలా ప్రాంతాలు తాను గుర్తించలేనని బాధితురాలు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ ఎవరూ లేని ప్రాంతానికి తీసుకు వెళ్లి ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
కన్నడ పాటలు పెట్టిన డ్రైవర్
వ్యాన్ను ఎవరూ లేని ప్రదేశంలో తిప్పిన డ్రైవర్ అంతసేపు కన్నడ పాటలు పెట్టాడని బాధితురాలు చెప్పారని తెలుస్తోంది. తనను మూడు గంటల పాటు తిప్పారని చెప్పారు. వారు కన్నడలో మాట్లాడుకున్నారని పోలీసులకు చెప్పారు.
సిసిటీవీ ఫుటేజీల పరిశీలన
పోలీసులు ఆయా ట్రాఫిక్ ప్రాంతాల్లో ఉన్న సిసిటివి పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దర్ని అరెస్టు చేశారు. మరోవైపు, ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.
షాక్కు గురైన బాధితురాలు
బాధితురాలిని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. బాధితురాలు ఆదివారం అర్ధరాత్రి రెండు గంటలకు ఆసుపత్రికి వచ్చిందని, పరీక్షలు నిర్వహించామని, ఆమెను డిశ్చార్జ్ చేశామని, ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు సంరక్షణలో ఉన్నారు. విషయం తెలియగానే గ్వాలియర్ నుంచి తల్లిదండ్రులు బెంగళూరుకు వచ్చారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ.. షాకింగ్లో ఉందని, కౌన్సెలింగ్ అవసరమని తెలుస్తోంది.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications